కరీంనగర్క్రైం: రంజాన్ సందర్భంగా ముస్లింలు ప్రార్థనలు నిర్వహించే ఈద్గాల వద్ద భద్రతా ఏర్పాట్లను సీపీ గౌస్ ఆలం బుధవారం పరిశీలించారు. సాలెహ్ నగర్, సప్తగిరికాలనీ, కరీంనగర్ వన్టౌన్ పోలీసు స్టేషన్ ఎదుట ఉన్న ఈద్గాలతోపాటు పలు ప్రార్థనా మందరాలను సందర్శించారు. ప్రార్థనలు జరిగే సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈద్గాల వైపు వచ్చే రహదారుల్లో ట్రాఫిక్ జామ్ కాకుండా చేడాలన్నారు. అవసరమైన చోట దారి మళ్లింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం నగరంలోని పలు పదోతరగతి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.


