
‘మాదకద్రవ్యాల నియంత్రణకు కృషి చేయాలి’
కామారెడ్డి క్రైం: జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు కృషి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ సూచించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో బుధవారం నార్కొటిక్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈనెల 26 న అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన, చిత్ర లేఖన పోటీలను నిర్వహించాలన్నారు. మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తయారు చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. సమావేశంలో అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ హన్మంతరావు, డీటీవో శ్రీనివాస్రెడ్డి, డీఈవో రాజు, డీఏవో తిరుమల ప్రసాద్, యాంటీ నార్కొటిక్ విభాగం డీఎస్పీ సోమనాథం, డీసీపీవో స్రవంతి తదితరులు పాల్గొన్నారు.