బాన్సువాడ : ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులు త్వరగా ప్రారంభించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. బుధవారం పట్టణంలోని బీడీ వర్కర్స్ కాలనీలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి కలెక్టర్ భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నారు. ఇంకా నిర్మాణాలు ప్రారంభించని వారు త్వరగా పనులు మొదలుపెట్టాలని సూచించారు.
కలెక్టర్ దృష్టికి సమస్య..
బీడీ వర్కర్స్ కాలనీలో కలెక్టర్ భూమి పూజ చేసిన ఇందిరమ్మ లబ్ధిదారుడి ప్లాట్లో ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఈ విషయాన్ని లబ్ధిదారు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ట్రాన్స్కో అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం పాత బాన్సువాడ సహకార సంఘంలోని రేషన్ దుకాణంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. సన్న బియ్యం పంపిణీ ఈ నెలాఖరు వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. కార్యక్రమాలలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, ప్రత్యేకాధికారి రాజు, డీఎల్పీవో సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్