‘సర్కారు బడిలోనే నాణ్యమైన విద్య’ | - | Sakshi
Sakshi News home page

‘సర్కారు బడిలోనే నాణ్యమైన విద్య’

Jun 19 2025 4:38 AM | Updated on Jun 19 2025 4:38 AM

‘సర్క

‘సర్కారు బడిలోనే నాణ్యమైన విద్య’

బాన్సువాడ : ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతోందని జిల్లా విద్యాధికారి రాజు పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, నోటు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు ఉపయోగించుకోవాలన్నారు. బాగా చదివి ఉన్నత స్థానానికి చేరాలని సూచించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి నాగేశ్వర్‌రావు, ప్రధానోపాధ్యాయురాలు సంతోషి, ఉపాధ్యాయులు సత్యనారాయణ, శంభ్యనాయక్‌, సురేందర్‌, హరిశ, సుజాత, జమున, సంగీత తదితరులు పాల్గొన్నారు.

తాగు నీటి అవసరాలకు ‘సాగర్‌’ జలాలు

నిజాంసాగర్‌: నిజామాబాద్‌, బోధన్‌, బాన్సువాడ పట్టణ ప్రాంత ప్రజల తాగునీటి అవసరాల కోసం బుధవారం నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేశారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఇరిగేషన్‌ గేట్ల ద్వారా ప్రధాన కాలువకు 1,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రధాన కాలువకు విడుదల చేస్తున్న నీటిని డిస్ట్రిబ్యూటరి తూముల ద్వారా వృథా చేయకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. బెల్లాల్‌ చెరువుతో పాటు అలీసాగర్‌ రిజర్వాయర్‌ వరకు 0.3 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు. మూడు రోజుల పాటు ప్రధాన కాలువ నీటి విడుదల కొనసాగనుంది. నిజాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు(17.8టీఎంసీలు) కాగా బుధవారం సాయంత్రం వరకు 1,393.78 అడుగుల(6.3 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.

షబ్బీర్‌అలీని కలిసిన

చంద్రశేఖర్‌రెడ్డి

కామారెడ్డి టౌన్‌: టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి బుధవారం హైదరాబాద్‌లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీని కలిశారు. ఆయనను సన్మానించారు. అలాగే ఎల్లారెడ్డి, జుక్కల్‌ ఎమ్మెల్యేలు మదన్‌మోహన్‌రావు, లక్ష్మీకాంతారావులను కలిసి సన్మానించారు. ఆయన వెంట మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ గడ్డం ఇందుప్రియ, మాజీ కౌన్సిలర్లు, నాయకులు రవి, శ్రీనివాస్‌, పాత శివకృష్ణమూర్తి, చాట్ల వంశి, మమత, సాయిబాబా, సలీం, రమే ష్‌, మహేష్‌, ప్రసాద్‌ తదితరులున్నారు.

మంత్రిని కలిసిన

డీసీసీ అధ్యక్షుడు

కామారెడ్డి టౌన్‌: రాష్ట్ర మంత్రి వివేక్‌ వెంకటస్వామిని బుధవారం డీసీసీ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌రావు హైదరాబాద్‌లో కలిశారు. ఆయనను సత్కరించారు. ఆయన వెంట జహీరాబాద్‌ ఎంపీ సురేశ్‌ షెట్కార్‌ ఉన్నారు.

దోస్త్‌ ప్రత్యేక కేటగిరి

ధ్రువపత్రాల పరిశీలన

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో దోస్త్‌ ఆన్‌లైన్‌ డిగ్రీ ప్రవేశాలకు 2025–26 విద్యాసంవత్సరానికి రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ప్రత్యేక కేటగిరి విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలను బుధవారం పరిశీలించినట్లు కో ఆర్డినేటర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. వర్సిటీ అడ్మిషన్స్‌ కార్యాలయంలో ధ్రువపత్రాలను పరిశీలించారు. ప్రత్యేక కేటగిరీ పీహెచ్‌సీ, సీఏపీ, ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌, ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ ఆక్టివిటీస్‌కు సంబంధించి ఎన్‌సీసీలో ఆరుగురు, స్పోర్ట్స్‌లో ముగ్గురు, సీఏపీలో ముగ్గురు విద్యార్థులు హాజరైనట్లు ఆయన తెలిపారు.

‘సర్కారు బడిలోనే నాణ్యమైన విద్య’
1
1/3

‘సర్కారు బడిలోనే నాణ్యమైన విద్య’

‘సర్కారు బడిలోనే నాణ్యమైన విద్య’
2
2/3

‘సర్కారు బడిలోనే నాణ్యమైన విద్య’

‘సర్కారు బడిలోనే నాణ్యమైన విద్య’
3
3/3

‘సర్కారు బడిలోనే నాణ్యమైన విద్య’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement