
‘వేగంగా కాంటాలు వేయాలి’
భిక్కనూరు: కొనుగోలు కేంద్రాలలో ధాన్యా న్ని వేగంగా కాంటాలు వేయాలని టాస్క్ఫో ర్స్ ఓఎస్డీ శ్రీధర్రెడ్డి సూచించారు. సోమ వారం టాస్క్ఫోర్స్ అధికారులు భిక్కనూరు మండల కేంద్రంలో సింగిల్విండో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలోని రికార్డులను, వడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఓఎస్డీ శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ కాంటాలు అయిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ చే యాలని సూచించారు. వారి వెంట సింగిల్విండో అధ్యక్షుడు గంగళ్ల భూమయ్య, ఉపా ధ్యక్షుడు ముచ్చర్ల రాజిరెడ్డి, టాస్క్ఫోర్స్ అ ధికారులు అజయ్బాబు, లక్ష్మయ్య, శ్రీనివాస్రావు, సుదర్శన్, ఎన్ఫోర్స్మెంట్ డిప్యూ టీ తహసీల్దార్ కిష్టయ్య, అసిస్టెంట్ రిజిస్ట్రా ర్ రమేశ్ ఉన్నారు.
బ్లూ కోల్ట్స్ సిబ్బందికి అభినందన
కామారెడ్డి క్రైం: పిట్లం మండల కేంద్రంలో రెండు రోజుల క్రితం చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించిన మహిళను కాపాడిన బ్లూ కోల్ట్స్ సిబ్బంది కానిస్టేబుల్ రవిచంద్ర, హోంగార్డు మారుతిలను ఎస్పీ రాజేశ్ చంద్ర అభినందించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వారిని అభినందించి నగ దు ప్రోత్సాహకాన్ని అందించారు. ప్రజల ర క్షణ కోసం పోలీసులు ప్రదర్శించే ధైర్య సా హసాలు శాఖకు గౌరవాన్ని తీసుకువస్తాయ ని పేర్కొన్నారు.
నేడు బీఎస్ఎన్ఎల్
సేవా శిబిరం
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ రోడ్లో గల బీఎస్ఎన్ఎల్ సంస్థ కా ర్యాలయంలో మంగళవారం వినియోగదారుల సేవా శిబిరం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని సంస్థ డీఈ సురేందర్ సోమవా రం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఏవైనా ఫిర్యాదులు, బిల్లులకు సంబంఽధించిన సమస్యలు, ఇతర సేవలపై సలహా లు, సూచనల కోసం శిబిరాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
‘సంఘాల పనితీరు భేష్’
దోమకొండ : స్వయం సహాయక సంఘాల పనితీరు బాగుందని గ్రామీణ పేదరిక ని ర్మూలన సంస్థ జీవనోపాధుల డైరెక్టర్ జాన్స న్ పేర్కొన్నారు. సోమవారం దోమకొండలో మహిళా సంఘాలు చేపడుతున్న జీవనోపాధుల కార్యక్రమాలను ఆయన డీఆర్డీవో సు రేందర్తో కలిసి పరిశీలించారు. లింగుపల్లి గ్రామంలో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. మండల కేంద్రంలో మహిళలు నిర్వహిస్తున్న ఎంటర్ప్రైజెస్ని సందర్శించా రు. అనంతరం గ్రామ సంఘంలో ఏర్పాటు చేసిన స్టిచ్చింగ్ సెంటర్ను ప్రారంభించారు. ముండల సమాఖ్య ద్వారా నిర్వహిస్తున్న మ హిళా శక్తి క్యాంటీన్ను సందర్శించి, భోజనం చేసి వారి పనితీరు మెచ్చుకున్నారు. నాణ్యమైన ఆహారం అందించాలని, పరిశుభ్రత పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీడీ కృష్ణమురళి, ఎంపీడీవో ప్రవీణ్కుమా ర్, డీపీఎం సుధాకర్, ఏపీఎం రాజు తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి టౌన్:ప్రాథమిక, ఉన్నతపాఠశాల ల ఉపాధ్యాయులకు మండల, జిల్లా స్థాయిలలో శిక్షణ ఇవ్వడంకోసం సబ్జెక్ట్ రిసోర్స్ ప ర్సన్స్ను నియమించనున్నట్లు డీఈవో రాజు తెలిపారు. ఇందుకోసం అర్హులైన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయుల శిక్షణ కోసం మండల రిసోర్స్ పర్సన్స్ –8 (తెలుగు/ఇంగ్లిష్), జిల్లా రిసోర్స్ పర్సన్స్ –10 (తెలుగు/ఇంగ్లిష్), 4 (ఉర్దూ), అలాగే స్కూల్ అసిస్టెంట్ హైస్కూల్ ఉపాధ్యాయు ల శిక్షణ కోసం డీఆర్పీలు–36(తెలుగు/ఇంగ్లిష్)–10,(ఉర్దూ), అలాగే హెచ్ఎంల శిక్షణ కోసం డీఆర్పీలు–8 పోస్టుల భర్తీ కోసం ఈ నెల 24లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఎంఆర్పీ పోస్టుల కోసం స్థానిక మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో, డీఆర్పీ పోస్టుల దరఖాస్తుల కోసం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

‘వేగంగా కాంటాలు వేయాలి’

‘వేగంగా కాంటాలు వేయాలి’