
రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనుల పరిశీలన
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను సోమవారం జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పరిశీలించారు. ఇంజినీర్లతో పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూ.40 కోట్లతో రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నాయన్నారు. పనులను త్వరగా పూర్తి చేయాలని ఎంపీ రైల్వే అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమీపంలో బ్రిడ్జి లేదా ఆర్వోబీ నిర్మించేందుకు సర్వే జరుగుతోందన్నారు. పాతరాజంపేట వద్ద కూడా రైల్వే బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఇన్, ఔట్ గేట్లను ఏర్పాటు చేసే క్రమంలో ఉపాధి కోల్పోతున్న వారికి రైల్వేశాఖ నిర్మించే మడిగెలు కేటాయించాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ అధికారులకు సూచించారు. వారి వెంట అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో వాణి, మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్రెడ్డి, కాంగ్రెస్ నేతలు అశోక్రెడ్డి, పాత రాజు, పండ్ల రాజు, శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాస్ తదితరులున్నారు.
త్వరితగతిన పూర్తి చేయాలని
ఆదేశించిన ఎంపీ సురేశ్ షెట్కార్
మడిగెలు కోల్పోయే వారికి ప్రత్యామ్నాయం చూపాలి: షబ్బీర్ అలీ