రెండు కాళ్లు చచ్చుబడిపోయినా అధికారులు స్పందించడం లేదు. గత రెండేళ్లుగా అనేకసార్లు ఫిర్యాదు చేసినా నాకు వికలాంగ పింఛన్ ఇవ్వడం లేదు. సదరం సర్టిఫికెట్ కావాలని అధికారులు చెబుతున్నారు. ఆ సదరం సర్టిఫికెట్ కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి అనేక సార్లు తిరిగాను, అయినా ఎవరూ స్పందించడం లేదు.
– పసుపులేటి నరసింహమూర్తి,
రాజుపాలెం, కిర్లంపూడి మండలం
ఆన్లైన్లో తప్పు సరిచేయడం లేదు
నా వ్యవసాయ భూమి 4.43 ఎకరాలను ఆన్లైన్లో దేవదాయ భూమిగా చూపిస్తోంది. దీంతో ప్రభుత్వం నుంచి నాకు ఏ విధమైన సహాయం అందడం లేదు. ఆ భూమి కష్టార్జితంతో కొనుగోలు చేసిన భూమి. ఆన్లైన్ తప్పును సరిచేయాలని గత రెండేళ్లుగా అధికారులు చుట్టూ తిరుగుతున్నాను. ఎటువంటి ప్రయోజనం కనిపించడం లేదు. తిరిగి తిరిగి విసుగు చెందాను.
– వి.వెంకన్నదొర, రావికంపాడు, తొండంగి మండలం


