
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
గద్వాల: రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుపు తథ్యమని ప్రతిఒక్కరు కూడా క్షేత్రస్థాయిలో వెళ్లి పార్టీ బలోపేతం కోసం పనిచేసి గెలుపొందేందుకు కృషి చేయాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నూతనంగా ఎన్నికై న జిల్లా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారంలో ఆమె పాల్గొని మాట్లాడారు. నూతన జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై న రామాంజనేయులు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు బూత్స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కృషిచేయాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ గెలుపును ఎవరు అడ్డుకోలేరని కార్యకర్తలు ఆత్మవిశ్వాసంతో పనిచేయాలన్నారు. ఆధోనిలో 70వేల మంది ముస్లిం ఓటర్లు ఉన్నారని, అలాంటి చోటనే బీజేపీకి చెందిన పార్థసారధి గెలుపొందారని పార్థసారధి గెలుపును స్ఫూర్తిగా తీసుకుని గద్వాలలో బీజేపీ గెలిచే వరకు పనిచేయాలన్నారు. గత ఎంపీ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థికి 20వేల మెజారిటీ ఇచ్చి బీజేపీ ఆదిపత్యాన్ని నిరూపించినట్లు గుర్తుచేశారు. రాష్ట్రంలో పదేళ్లుగా బీఆర్ఎస్ పార్టీ చేసిన అరాచకాలను చరమగీతం పాడాలనే ఉద్దేశ్యంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారని అయితే ఏడాది కాలంలోనే కాంగ్రెస్ పార్టీ పాలనపై ప్రజలల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను పూర్తిగా మోసం చేసిందని కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. బీజేపీ పార్టీ చేసేదే చెబుతుంది.. చెప్పిందే చేస్తుందని ఆమె అన్నారు. కరోనా సమయంలో ప్రపంచ దేశాలన్నీ కుదేలైపోతే దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టి ముందుకు నడిపిన నాయకుడు ప్రధాని మోడీ అని గుర్తు చేశారు. దేశంలో అన్ని వర్గాల ప్రజల సంక్షమాభివృద్ధి కోసం పాటుపడుతున్న నాయకుడు ప్రధాని మోడీ అన్నారు. నూతన అధ్యక్షుడు రామాంజనేయులు పార్టీలోని ప్రతిఒక్కరిని కలుపుకుని వెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో నాయకులు డీకే స్నిగ్ధారెడ్డి, భరత్కుమార్, రాంచంద్రారెడ్డి, ఎక్బోటేరవి, అయిజ రాంచంద్రారెడ్డి, రమాదేవి, వెంకట్రాములు, జయలక్ష్మీ, శివారెడ్డి, రజక జయశ్రీపాల్గొన్నారు.
వన్ నేషన్...వన్ ఎలక్షన్
వన్ నేషన్... వన్ ఎలక్షన్ అనే నినాదంతో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని దీని వల్ల దేశ ఖజానాపై ఆర్థిక భారం తగ్గడమే కాకుండా ప్రజలకు సైతం అన్ని విధాల మేలు జరుగుతుందని బీజేపీ జిల్లా ఇన్చార్జ్ సంజీవ్రెడ్డి అన్నారు. గద్వాల లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు.