గద్వాల: జిల్లావ్యాప్తంగా ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను వారం రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ ఽఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనుల నిర్వహణలో అలసత్వం వహించకుండా నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలన్నారు. పనుల్లో నాణ్యత, పారదర్శకత పాటించడంతో పాటు ప్రతి పనికి సంబంధించిన సమగ్ర వివరాలను అందుబాటులో ఉండాలని సూచించారు. మండలాల వారీగా పూర్తయిన పనుల జాబితా, ఎఫ్టీఓ జనరేషన్, పెండింగ్, పురోగతిలో ఉన్న పనులకు సంబంధించి నిర్దేశిత సమయంలోగా ఎంబీ రికార్డు వంటి వివరాలను నమోదు చేయాలన్నారు. చేసిన పనులకు బిల్లులు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, పంచాయతీరాజ్ ఈఈ దామోదర్రావు, డీఈలు, ఏఈలు ఉన్నారు.