వినియోగదారుల్లో చైతన్యం రావాలి | - | Sakshi
Sakshi News home page

వినియోగదారుల్లో చైతన్యం రావాలి

Mar 15 2025 12:55 AM | Updated on Mar 15 2025 12:54 AM

జిల్లాలో ప్రతిరోజు హక్కుల ఫోరానికి రెండు నుంచి మూడు వరకు కేసులు వస్తుంటాయి. ఎక్కువగా ఎలక్ట్రానిక్‌ వస్తువులు, జీవిత బీమా, చిట్‌ఫండ్‌, ఫైనాన్స్‌లో నష్టపోయిన వాళ్లు అధికంగా వస్తుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ఎవరూ రావడం లేదు. పట్టణ ప్రాంతాల నుంచి అవగాహన ఉన్న వ్యక్తులు మాత్రమే కేసులు వేయడానికి వస్తున్నారు. ఇంకా ప్రజల్లో దీనిపై చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. వచ్చిన కేసులు పెండింగ్‌లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి కృషి చేస్తున్నాం. జిల్లాలో వినియోగదారులు ఎలాంటి కేసులు వేయడానికి అవగాహన లేకుంటే 08542–245633 నంబర్‌కు ఫోన్‌ చేయాలి.

– సృజన్‌కుమార్‌, వినియోగదారుల

వివాదాల పరిష్కార కమిషన్‌ సూపరింటెండెంట్‌

ఎలక్ట్రానిక్‌ తూకాల్లో మోసాలు

గద్వాలలో చాలా వరకు వ్యాపార దుకాణాల్లో ఎలక్ట్రానిక్‌ తూకాలు ఏర్పాటు చేసినా వాటిలో కూడా మోసాలు జరుగుతున్నాయి. ఎలక్ట్రానిక్‌ తూకాలను ముందస్తుగానే 15– 20 గ్రాముల వరకు ఎక్కువ ఉండేలా సర్దుబాటు చేసి తూకాలలో మోసాలకు పాల్పడుతున్నారు. వీటిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. – హుస్సేన్‌, గద్వాల

బంగారం షాపుల్లో..

గద్వాల పట్టణం పెద్ద వ్యాపార కేంద్రం. ఇక్కడ ముఖ్యంగా బంగారు వ్యాపారం పెద్దఎత్తున జరుగుతుంది. చాలా వరకు బంగారు షాపులలో ఎలక్ట్రానిక్‌ తూకాలు వినియోగిస్తున్నా 10 గ్రాముల బంగారంపై కనీసం 0.5– 1 గ్రాముల వరకు తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్కరోజు కూడా ఈ షాపులలో సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించలేదు. – రమేష్‌, గద్వాల

వినియోగదారుల్లో చైతన్యం రావాలి 
1
1/1

వినియోగదారుల్లో చైతన్యం రావాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement