జిల్లాకేంద్రంలోని వంద పడకల ఆస్పత్రి సమీపంలో జాతీయ రహదారిపై గల రోడ్డు మైసమ్మ ఆలయం పక్కనే చిన్నవాగు ప్రవహిస్తుంది. ఆ వాగుపై నేషనల్ హైవే అధికారులు బ్రిడ్జిని నిర్మించారు. వాగుకు ఇరువైపులా రక్షణ గోడను అతి చిన్నగా నిర్మించారు. దీంతో గతంలో కారు, లారీలు అదుపు తప్పి వాగులో పడిపోయిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. వాహనదారులు ప్రాణాలు కోల్పోకపోయినప్పటికీ తీవ్ర గాయాలైన ఘటనలు ఉన్నాయి. పట్టణం మీదుగా భారీ వాహనాలు వందలసంఖ్యలో వెళ్తుండటంతో ఏ ప్రమాదం ఎప్పుడు సంభవిస్తుందోనని వాహనదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.


