● ఎమ్మెల్యే సత్యనారాయణ రావు
భూపాలపల్లి రూరల్: ఆదివాసీల హక్కుల పరిరక్షణకు కొమురం భీం ఆశయాలే స్ఫూర్తి అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ప్రపంచ ఆదివాసీ హక్కుల దినోత్సవం సందర్భంగా ఆదివారం పట్టణంలోని కొమురంభీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ.. ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, జల్–జంగల్–జమీన్ పరిరక్షణ కోసం కొమురం భీం చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఆదివాసీలు డోలు వాయిద్యాలు సాంప్రదాయ నృత్యాలతో జిల్లాకేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, ఆదివాసీ, తుడుందెబ్బ నాయకులు పాల్గొన్నారు.


