జారీ చేసిందెవరు?
రేగొండ: కాటారం మండలానికి చెందిన వ్యక్తి రేగొండ మండలం నుంచి కులం సర్టిఫికెట్ తీసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాటారం మండలం గుండ్రాత్పల్లి గ్రామానికి చెందిన తోటపెల్లి సావిత్రి జిల్లాకేంద్రంలోని ఓ మీసేవ సెంటర్లో సిటిజన్ పోర్టల్ ద్వారా రేగొండ మండలకేంద్రం నుంచి కుల ధ్రువీకరణ పత్రం మంజూరు కోసం డిసెంబర్ 1న దరఖాస్తు చేసుకుంది. రేగొండ తహసీల్దార్ కార్యాలయంలో ఎటువంటి పత్రాలూ అందజేయకుండానే డిసెంబర్ 2న గాండ్ల–6 (బీసీ–బీ) కుల ధ్రువీకరణ పత్రం మంజూరైంది. ఈ సర్టిఫికెట్తో ఆమె ఇటీవల సర్పంచ్గా పోటీచేసి గెలుపొందింది. దీంతో ప్రత్యర్థి జనవరి 2న సమాచార హక్కు చట్టం ద్వారా కుల ధ్రువీకరణ పత్రం వివరాలను తహసీల్దార్ను కోరగా విషయం బయటకు వచ్చింది. ఈ ఘటనపై తహసీల్దార్ శ్వేతను వివరణ కోరగా.. కాటారం మండలానికి చెందిన వ్యక్తికి రేగొండలో కుల ధ్రువీకరణ పత్రం మంజూరైన విషయం వాస్తవేమన్నారు. ఈ విషయమై ఆర్ఐ, ఇద్దరు జీపీఓలకు, జూనియర్ అసిస్టెంట్కు మెమో జారీచేసినట్లు తెలిపారు. తప్పుడు పత్రాలతో సర్టిఫికెట్ కోసం అప్లై చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకుంటామన్నారు. నివేదికను కలెక్టర్కు పంపినట్లు తెలిపారు.
కాటారం వ్యక్తికి
రేగొండలో కులం సర్టిఫికెట్


