సమస్యలు తెలుసుకునేందుకు బస్తీబాట | - | Sakshi
Sakshi News home page

సమస్యలు తెలుసుకునేందుకు బస్తీబాట

Jan 3 2026 7:17 AM | Updated on Jan 3 2026 7:17 AM

సమస్యలు తెలుసుకునేందుకు బస్తీబాట

సమస్యలు తెలుసుకునేందుకు బస్తీబాట

సమస్యలు తెలుసుకునేందుకు బస్తీబాట

భూపాలపల్లి అర్బన్‌: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాలనీల్లో సమస్యలను తెలుసుకునేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో బస్తీబాట నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. 14వ వార్డు జంగేడులో బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం బస్తీబాట నిర్వహించారు. బస్తీబాటకు హాజరైన గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి కాలనీలు తిరుగుతూ కాలనీవాసులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. తాగునీరు, డ్రెయినేజీ, రోడ్లు, పారిశుద్ధ్యం, మౌలిక వసతులపై ప్రజలు సమస్యలు విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా గతంలో చేపట్టిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తూ, భవిష్యత్‌లో కూడా భూపాలపల్లి అభివృద్ధికి కట్టుబడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement