
ఉగ్రదాడిని ప్రతిఒక్కరూ ఖండించాలి
భూపాలపల్లి రూరల్: కాశ్మీర్లో ఉగ్రమూకలు సృష్టించిన మరణకాండను ప్రతిఒక్కరూ ఖండించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిశిధర్రెడ్డి అన్నారు. కాశ్మీర్లో మృతిచెందిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ అధ్వర్యంలో కాగడాలు, కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ సెంటర్లో ఉగ్రవాదుల దిష్టిబొమ్మలు దహనం చేశారు. అనంతరం నిశిధర్రెడ్డి మాట్లాడుతూ.. ఉగ్రదాడికి బీజేపీ ప్రభుత్వం ధీగాటుగా సమాధానం చెబుతుందన్నారు. దాడిలో మృతిచెందిన వారి ఆత్మశాంతి కోరుతూ మౌనం పాటించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకుడు, రాజమౌళిగౌడ్, విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ నాయకులు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు నిశిధర్రెడ్డి