
మోక్షం ఎప్పుడో..!
సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్
● 2020 సంవత్సరంలో స్వీకరణ..
● ఇప్పటివరకు పట్టా పాస్బుక్లు లేవు
● కార్యాలయాల చుట్టూ రైతుల ప్రదక్షిణ
● జిల్లావ్యాప్తంగా 51,347 దరఖాస్తులు
● భూభారతిపైనే ఆశలు..
భూమి మార్పిడి సాదాబైనామాల కోసం దరఖాస్తుకు ప్రభుత్వం మొదట 2020 అక్టోబర్ 31వ వరకు గడువు విధించగా మరోమారు నవంబర్ 10వరకు పెంచింది. ధరణి పోర్టల్ 2020 అక్టోబర్ 29 నుంచి అమలులోకి వచ్చింది. కోర్టు ఆదేశాల ప్రకారం కొత్త చట్టం అమలు తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిశీలించరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాల కంటే ముందు అక్టోబర్ 28వరకు జిల్లాలో 1,896 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. అనంతరం 51,347 మంది సాదాబైనామాల కోసం దరకాస్తు చేసుకున్నవారు అయోమయంలో పడ్డారు. కోర్టు ఆదేశాలతో ఇప్పటి వరకు దరఖాస్తులు పరిశీలనకు నోచుకోలేదు. కొత్త చట్టం ప్రకారం మార్గదర్శకాలు వస్తే మేలు జరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పట్టాపాసుపుస్తకాలు అందించేలా చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.
భూపాలపల్లి అర్బన్: సాదాబైనామాలకు చట్టబద్ధత కల్పించేందుకు దరఖాస్తులు స్వీకరించి ఐదేళ్లు కావస్తుంది. వాటికి ఇప్పటివరకు మోక్షం కలుగడం లేదు. ధరణి సమస్యల పరిష్కారానికి నోచుకున్నప్పటికీ సాదాబైనామా గురించి గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. తెల్ల కాగితాలపై రాసుకున్న క్రయవిక్రయాల భూముల క్రమబద్ధీకరణకు బీఆర్ఎస్ ప్రభుత్వం 2020 అక్టోబర్లో రైతుల నుంచి మీ సేవ ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. దీంతో తెల్ల కాగితాలపై రాసుకుని విక్రయాలు జరిపిన కాగితాలపై తాతలు, తండ్రుల కాలం నుంచి సాగు చేసుకుంటున్న వారంతా దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో 51,347 దరఖాస్తులు అందాయి. నాటినుంచి దరఖాస్తులు పెండింగ్లోనే ఉన్నాయి. వీటిని పూర్తిస్థాయిలో పరిశీలించి కొత్త పట్టాలు మంజూరు చేయాలని రైతులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ‘భూమాత’ను ప్రారంభించింది. ఇప్పటివరకు క్రమబద్ధీకరణ, పరిష్కారానికి నోచుకోని భూ సమస్యలు పనిష్కారం అవుతాయని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
భారీ సంఖ్యలో దరఖాస్తులు
2014 జూన్ 2కు ముందు ఐదెకరాల్లోపు వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు తెల్ల కాగితాలపై రాసుకున్న వారికి ఉచితంగా రిజిస్ట్రేషన్కు గత ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. 2020 అక్టోబర్ 31వరకు వివిధ మండలాల నుంచి వచ్చాయి. మొదట వ్యవసాయ భూములు, గ్రామీణ ప్రాంతాల్లోని వాటికి మాత్రమే అవకాశం కల్పించింది. అనంతరం నవంబర్ 1నుంచి 10వరకు గడువు పొడిగించింది. దాంతోపాటు అర్బన్ ప్రాంతాల్లోని మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల వారికి సాదాబైనామాలకు అవకాశం కల్పిస్తూ అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో భూపాలపల్లి మున్సిపాలిటీల్లోని వారికి కూడా అవకాశం కలిసి వచ్చింది. పది రోజుల వ్యవధిలోనే 51,347 వరకు దరఖాస్తులు వచ్చాయి. రెవెన్యూ అధికారులు పరిశీలించి క్రయవిక్రయదారుల ఆమోదంతో రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించాల్సి ఉంది. దరఖాస్తుల పరిశీలన, రిజిస్ట్రేషన్లు ఉంటాయని దరఖాస్తుదారులు భావిస్తున్న సమయంలో కోర్టు ఆదేశాలతో అయోమయంలో పడ్డారు. పాత రెవెన్యూ చట్టం ప్రకారం దరఖాస్తులు స్వీకరించడంతో అప్పుడే ప్రవేశపెట్టిన ధరణి చట్టంతో సాదాబైనామాలు నిలిచిపోయాయి.
గత చట్టంతో తిరకాసు..

మోక్షం ఎప్పుడో..!