నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్లు

Apr 19 2025 9:28 AM | Updated on Apr 19 2025 9:28 AM

నెలాఖ

నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్లు

వెంకటాపురం(ఎం)/ములుగు: అర్హులైన పేదలందరికీ పార్టీలకతీతంగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, ఈ నెలాఖరులోగా ప్రతీ గ్రామంలో ప్రారంభిస్తామని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. భూ భారతి పైలట్‌ మండలంగా ఎంపిక చేసిన ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలకేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన రెవెన్యూ సదస్సుకు మంత్రులు ధనసరి అనసూయ (సీతక్క), కొండా సురేఖలతో కలిసి ఆయన హాజరయ్యారు. పలువురు రైతులనుంచి దరఖాస్తులు స్వీకరించి రశీదులు అందజేశారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇందిరమ్మ పేరు వింటేనే ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. జిల్లాలో గిరిజనులు, గిరిజనేతరులు ఉన్నారని, ఈ ప్రాంత సమస్యలపై ప్రత్యేక కమిటీ వేసి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు. రైతుల వద్దకే వెళ్లి అధికారులు భూ సమస్యలు పరిష్కరిస్తారన్నారు.

రైతును రాజు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ : మంత్రి కొండా సురేఖ

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి నిరంతరం రైతుల గురించి ఆలోచించి రైతును రాజుగా చేశారని మంత్రి కొండా సురేఖ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు న్యాయం చేసేందుకే భూ భారతి చట్టాన్ని తీసుకు వచ్చారన్నారు. రైతులను ఇబ్బందులు పెట్టకుండా అధికారులు సేవలందించాలని, తప్పు చేసే వారిపై చర్యలు ఉంటాయన్నారు.

భూమికి రైతుకు ఉన్న బంధమే తల్లీబిడ్డ

సంబంధం: మంత్రి ధనసరి సీతక్క

తల్లీబిడ్డకు ఎలాంటి సంబంధం ఉంటుందో భూమికి రైతుకు అలాంటి బంధం ఉంటుందని, గత ప్రభుత్వం ధరణి పోర్టల్‌ తీసుకొచ్చి రైతుల ఆత్మహత్యలకు కారకులయ్యారని మంత్రి సీతక్క అన్నారు. నేడు రైతుల సమస్యలను పరిష్కరించడానికి సీఎం రేవంత్‌రెడ్డి భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చారన్నారు. ఈకార్యక్రమంలో మహబూబాబాద్‌ ఎంపీ పోరిక బలరాం నాయక్‌, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ రావు, కేఆర్‌.నాగరాజు, ఫైనాన్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రామకృష్ణారావు, కలెక్టర్‌ దివాకర టీఎస్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బానోతు రవిచందర్‌, అదనపు కలెక్టర్‌ మహేందర్‌ జీ, ఆర్డీఓ వెంకటేష్‌ పాల్గొన్నారు.

సామాన్య ప్రజల కోసమే ‘భూ భారతి’

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి

పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

భూ భారతి పైలట్‌ మండలం

వెంకటాపురం (ఎం)లో రెవెన్యూ సదస్సు

హాజరైన మంత్రులు ధనసరి సీతక్క,

కొండా సురేఖ

నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్లు1
1/3

నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్లు

నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్లు2
2/3

నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్లు

నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్లు3
3/3

నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement