ఏసు బోధనలు మానవాళికి దిక్సూచి | - | Sakshi
Sakshi News home page

ఏసు బోధనలు మానవాళికి దిక్సూచి

Apr 19 2025 9:28 AM | Updated on Apr 19 2025 9:28 AM

ఏసు బ

ఏసు బోధనలు మానవాళికి దిక్సూచి

భూపాలపల్లి అర్బన్‌: ఏసుప్రభు బోధనలు ప్రపంచ మానవాళికి దిక్సూచి అని సీఎస్‌ఐ ఫాస్ట్రేట్‌ కమిటీ చైర్మన్‌ రెవరెండ్‌ ఎం.కనకరత్నం తెలిపారు. గుడ్‌ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం జిల్లాకేంద్రంలోని సీఎస్‌ఐ చర్చితో పాటు జిల్లావ్యాప్తంగా 12 మండలాల్లో చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కనకరత్నం మాట్లాడుతూ.. మానవులంతా క్షమాగుణం అలవాటు చేసుకోవాలన్నారు. ఈ వేడుకల్లో సీఎస్‌ఐ చర్చి సంఘ సెక్రటరీ దుప్పటి మొగిలి, ట్రెజరర్‌ రవికుమార్‌, స్టీవార్డు ఇమ్మానియేల్‌ అమ్మగారు సంకీర్తన, సీ్త్రల మైత్రి, యూత్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

పనుల పరిశీలన

కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలో మే15 నుంచి 26 వరకు జరుగు సరస్వతి నది పుష్కరాలకు సంబంధించిన రూ.కోటితో చేపట్టిన ఎన్పీడీసీఎల్‌ విద్యుత్‌ లైన్‌ల ప్రగతిని ఆ శాఖ సీఈ రాజుచౌహాన్‌ పరిశీలించారు. శుక్రవారం ఆయన కాళేశ్వరంలో జరుగుతున్న విద్యుత్‌ పనులను పరిశీలించారు. సలహాలు, సూచనలు అందజేశారు. పనులన్నీ గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట ఎస్‌ఈ మల్చూర్‌ నాయక్‌, డీఈ పాపిరెడ్డి, ఏడీఈ నాగరాజు, ఏఈ శ్రీకాంత్‌ ఉన్నారు.

మట్టి తరలిస్తున్న

లారీల అడ్డగింత

కాటారం: శంకరాంపల్లి నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీలను శుక్రవారం గ్రామస్తులు, యువకులు అడ్డుకున్నారు. మట్టి తరలింపు నిలిపేయాలని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కాంట్రాక్టర్లు, పలువురు దళారులు గ్రామ సమీపంలోని చేల నుంచి అనుమతులు లేకుండా నిత్యం మట్టి తరలిస్తున్నారని ఆరోపించారు. చేలలో సుమారు 20 ఫీట్ల మేర మట్టి తవ్వకాలు చేపట్టడంతో గ్రౌండ్‌ వాటర్‌ తగ్గిపోయి మున్ముందు రోజుల్లో రైతులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా పదుల సంఖ్యలో మట్టి లారీలు గ్రామం మధ్య నుంచి తిరుగుతుండటంతో దుమ్ము అధికంగా లేవడంతో పాటు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ అంగజాల అశోక్‌, బోనగిరి శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

కేసీఆర్‌ను కలిసిన

జక్కు శ్రీహర్షిణి

కాటారం: మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణి శుక్రవారం మాజీ సీఎం కేసీఆర్‌ను తన నివాసంలో కలిశారు. శ్రీహర్షిణి జన్మదినం సందర్భంగా కేసీఆర్‌ ఆశీర్వాదం తీసుకోగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం ముందునడవాలని, నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండి సేవలందించాలని కేసీఆర్‌ సూచించినట్లు శ్రీహర్షిణి తెలిపారు. కష్టపడి పని చేస్తే రానున్న రోజుల్లో మంచి అవకాశాలు కల్పిస్తామని కేసీఆర్‌ మాట ఇచ్చినట్లు శ్రీహర్షిణి పేర్కొన్నారు. ఆమె వెంట బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు జక్కు రాకేశ్‌ ఉన్నారు.

వేముల శంకర్‌కు డాక్టరేట్‌

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాకేంద్రంలోని ఐటీ మాస్టర్‌ స్కిల్‌ హబ్‌ డైరెక్టర్‌, వాలంటరీ ఆర్గనైజేషన్‌ స్థాపకుడు వేముల శంకర్‌కు స్ఫూర్తి సొసైటీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్‌ రీసెర్చ్‌ యూనివర్సిటీ (యూఎస్‌ఏ) వారు అంతర్జాతీయ డాక్టరేట్‌ అవార్డును శుక్రవారం ప్రదానం చేశారు. హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో నిర్వహించిన సమావేశంలో అవార్డును అందజేశారు.

ఏసు బోధనలు  మానవాళికి దిక్సూచి 
1
1/4

ఏసు బోధనలు మానవాళికి దిక్సూచి

ఏసు బోధనలు  మానవాళికి దిక్సూచి 
2
2/4

ఏసు బోధనలు మానవాళికి దిక్సూచి

ఏసు బోధనలు  మానవాళికి దిక్సూచి 
3
3/4

ఏసు బోధనలు మానవాళికి దిక్సూచి

ఏసు బోధనలు  మానవాళికి దిక్సూచి 
4
4/4

ఏసు బోధనలు మానవాళికి దిక్సూచి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement