రోడ్డుకు అడ్డంగా గుంతతీసి నిరసన | - | Sakshi
Sakshi News home page

రోడ్డుకు అడ్డంగా గుంతతీసి నిరసన

Apr 16 2025 11:32 AM | Updated on Apr 16 2025 11:32 AM

రోడ్డుకు అడ్డంగా గుంతతీసి నిరసన

రోడ్డుకు అడ్డంగా గుంతతీసి నిరసన

రేగొండ: రోడ్డుకు అడ్డంగా గుంత తీసి ఓ జేసీబీ యాజమాని నిరసన తెలిపిన ఘటన కొత్తపల్లిగోరి మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. గత ప్రభుత్వంలో కొత్తపల్లిగోరి మండలంలోని జమ్‌షేడ్‌బేగ్‌పేట వద్ద దాదాపు రూ.3 కోట్ల రూపాయలతో బ్రిడ్ఙి నిర్మాణానికి అప్పటి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి శంకుస్థాపన చేశారు. పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్‌ బీటీ రోడ్డు మినహా బ్రిడ్ఙి నిర్మాణాన్ని పూర్తి చేశాడు. సదరు కాంట్రాక్టర్‌ బ్రిడ్ఙి నిర్మాణం కోసం ఉపయోగించిన జేసీబీ యాజమానికి డబ్బులు ఇవ్వలేదు. దీంతో మంగళవారం తాత్కాలిక రోడ్డు, బ్రిడ్ఙి రోడ్డుకు అడ్డంగా గుంత తీసి తన నిరసనను తెలిపాడు. దీంతో ఆ దారి గుండా ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఈ ఘటనపై స్పందించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందించిన అధికారులు గుంతలను పూడ్చడంతో యఽథావిధిగా వాహనాల రాకపోకలు సాగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement