మంగళవారం శ్రీ 15 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

మంగళవారం శ్రీ 15 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

Apr 15 2025 1:16 AM | Updated on Apr 15 2025 1:16 AM

మంగళవ

మంగళవారం శ్రీ 15 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

8లోu

అవగాహన కార్యక్రమాలు

● అగ్నిప్రమాదాల నివారణలో భాగంగా ఈనెల 14నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

● ఈనెల 14న జిల్లాలోని అగ్నిమాపక కేంద్రాలను సందర్శించి సిబ్బంది కుటుంబ సభ్యులతో సమీక్షలు నిర్వహించారు.

● 15న ప్రధాన కూడలి ప్రాంతాలైన బస్‌స్టేషన్‌, షాపింగ్‌ ఏరియాలు, మార్కెట్‌, సినిమా థియేటర్‌ అగ్ని ప్రమాదాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తారు.

● 16న హాస్పిటల్స్‌లో ఫైర్‌ సేఫ్టీపై అవగాహన సదస్సులు

● 17న అపార్ట్‌మెంట్లు, గ్యాస్‌ కంపెనీలు, విద్యుత్‌ శాఖ కార్యాలయాలు సందర్శించి ఫైర్‌ సేఫ్టీ పరికరాల పనితీరును పరిశీలించి వారికి అవగాహన కల్పిస్తారు.

● 18న పెట్రోల్‌ బంకులు, గ్యాస్‌ గోడౌన్స్‌ నిర్వాహకులకు..

● 19న దుకాణ సముదాయాలు, ఫంక్షన్‌హాళ్లు, విద్యాసంస్థలు, సినిమా థియేటర్లలో అవగాహన నిర్వహిస్తారు.

● 20న అగ్నిప్రమాదాలపై సమావేశం నిర్వహించి ప్రమాదాలు సంభవిస్తే ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే అంశాలపై అవగాహన, విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్‌ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుతులు అందజేయనున్నారు.

వారోత్సవాల వాల్‌పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న ఫైర్‌ సిబ్బంది

భూపాలపల్లి అర్బన్‌: సూరీడు నేలకొచ్చినట్టు ఎండలు మంట రేపుతున్నాయి. జనానికి సెగలు పుట్టిస్తున్నాయి. సామాన్య ప్రజలను అల్లాడిస్తున్నాయి. ఈ సమయంలోనే చిన్నపాటి అజాగ్రత్తతో అగ్ని ప్రమాదాలకు ఆస్కారం ఉంది. తద్వారా సర్వం బుగ్గి అవుతోంది. తీవ్ర నష్టాన్ని మిగుల్చుతోంది. ఎండా కాలం, మండించే కాలం కాబట్టి అప్రమత్తత అవసరమని అగ్నిమాపక శాఖ అధికారులు సూచిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఒకే ఒక్క అగ్నిమాపక కేంద్రం భూపాలపల్లిలో ఉంది.

గతేడాది రూ.3కోట్ల నుంచి

రూ.4కోట్ల మేర నష్టం

జిల్లాలో గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది మార్చి వరకు 41 అగ్నిప్రమాదాలు జరగగా వాటిల్లో సుమారు రూ.3 కోట్ల నుంచి రూ.4కోట్ల మేర నష్టం జరిగింది. అగ్నిప్రమాదాల్లో రూ.5 కోట్ల ఆస్తిని సిబ్బంది సకాలంలో స్పందించి కాపాడారు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉండటంతో ఏ చిన్నపాటి ప్రమాదం వాటిల్లినా తీవ్రంగా నష్ట పోవాల్సి రావడంతో అగ్నిప్రమాదాలను అదుపు చేసేందుకు అగ్నిమాపక శాఖాధికారులు విశేష కృషి చేస్తున్నారు.

న్యూస్‌రీల్‌

సమయస్ఫూర్తి అవసరం

ప్రస్తుతం ఎండలు అధికమయ్యాయి. ఈ సమయంలో అగ్నిప్రమాదం జరిగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. జిల్లాలో అధికశాతం తీరప్రాంత గ్రామాలు, మారుమూల ప్రాంతాలు కావడంతో ఏ చిన్న ప్రమాదం జరిగినా అంతా బుగ్గి అవుతుంది. గతంలో తీరప్రాంత గ్రామాల్లో అగ్నిప్రమాదాలు జరిగి భారీ నష్టం జరిగింది. ప్రమాదాలు జరిగిన సమయంలో సమయ స్ఫూర్తితో వ్యవహరిస్తే నష్టాన్ని నివారించవచ్చు.

అప్రమత్తతతోనే అగ్నిప్రమాదాల నివారణ

నిర్లక్ష్యం వహిస్తే తీవ్ర నష్టం

జిల్లాలో అగ్నిప్రమాద వారోత్సవాలు ఆరంభం

14నుంచి 20వరకు అవగాహన సదస్సులు

మంగళవారం శ్రీ 15 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 20251
1/4

మంగళవారం శ్రీ 15 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

మంగళవారం శ్రీ 15 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 20252
2/4

మంగళవారం శ్రీ 15 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

మంగళవారం శ్రీ 15 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 20253
3/4

మంగళవారం శ్రీ 15 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

మంగళవారం శ్రీ 15 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 20254
4/4

మంగళవారం శ్రీ 15 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement