
‘బిల్ట్ ఫ్యాక్టరీని ప్రారంభించాలి’
ఏటూరునాగారం: మంగపేట మండల పరిధిలోని కమలాపురంలో గల మూతపడిన బిల్ట్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బాధావత్ రాజు, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు పొద్దునూరు యాదగిరి అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ ఎదుట మానవహక్కుల వేదిక నాయకులు సోమవారం ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. 2014లో మూతపడిన బిల్ట్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించాలని, కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని ఐటీడీఏ నుంచి కమలాపూర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు కార్మికులతో పాదయాత్రను నిర్వహించారు. 1977 లో ఏపీ రేయాన్స్గా మొదలైన ఫ్యాక్టరీ బిల్ట్గా రూపాంతరం చెంది అనేక లాభాలను గడించిందని తెలిపారు. అనంతరం నష్టాలు వస్తున్నాయనే సాకుతో 2014లో బిల్ట్ను మూసివేశారని తెలిపారు. దీంతో దాదాపు 2వేల మంది రోడ్డున పడ్డారని వివరించారు. ఇప్పటికై నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి బిల్ట్ ఫ్యాక్టరీని తెరిపించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు హనుమాన్ ప్రసాద్, పద్మజ, పాలకుర్తి శ్రీనివాస్, లవ కుమార్, సమ్మయ్య, యుగేందర్, శంకర్, కరీంనగర్ జిల్లా బాధ్యులు మధు, అచ్యుత్, సదానందం, ఖమ్మం జిల్లా బాధ్యులు ఆదినారాయణ, బిల్ట్ కార్మికులు పాల్గొన్నారు.