
దళితబంధు నిధులు విడుదల చేయాలి
● రోడ్డుపై బైఠాయించిన లబ్ధిదారులు
కాటారం: గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళతబంధు పథకంలో భాగంగా ఎంపికై న లబ్ధిదారులకు మంజూరైన నిధులు విడుదల చేయాలని దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో శనివారం కాటారంలో దళితబంధు ధర్మయుద్ధం మహాధర్నా నిర్వహించా రు. చింతకాని క్రాస్ నుంచి మండల కేంద్రం వరకు ర్యాలీ చేపట్టిన లబ్ధిదారులు ప్రధానకూడలి లో జా తీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టా రు. ఈ సందర్భంగా సాధన సమితి జిల్లా అధ్యక్షు డు నమూండ్ల సంపత్ మహారాజ్ మాట్లాడుతూ దళితబంధు లేదా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన మేర కు అంబేడ్కర్ అభయహస్తం అమలు చేయాలన్నా రు. పెండింగ్లో ఉన్న నిధులను ఎంపికై న లబ్ధిదా రుల ఖాతాల్లో జమ చేయాలని పేర్కొన్నారు. చదువుకున్న దళిత మహిళలకు పరిశ్రమలు ఏర్పాటయ్యేలా చూడాలని, దివ్యాంగులకు ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. దళితబంధు నిధుల విడుదలకు కలెక్టర్ హామీ ఇవ్వాలని భీష్మించారు. సుమా రు నాలుగు గంటలపాటు ధర్నా కొనసాగడంతో ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. ఎస్సైలు నరేశ్, మహేందర్.. ఆందోళన విరమింపజేశారు. ఆందోళనలో జక్కయ్య, వెంకయ్య, మధుకర్, శ్రీనివాస్, చందు, నగేశ్, రాజు, రామన్న, రాజేశ్, తదితరులు పాల్గొన్నారు.