
బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా శ్రీనివాసచారి
భూపాలపల్లి అర్బన్: జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వలబోజు శ్రీనివాసచారి ఎన్నికయ్యారు. శుక్రవారం జిల్లా కోర్టు ఆవరణలో ఎన్నికలు నిర్వహించారు. జిల్లాలో 71 ఓట్లు ఉండగా 70మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఓటింగ్ నిర్వహించి 6గంటల వరకు కౌంటింగ్ నిర్వహించారు. కూనురు సురేష్కుమార్పై వలబోజు శ్రీనివాసచారి 20ఓట్ల మోజారిటీతో అధ్యక్షుడిగా గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా ఆనందరావుపై విలా శ్రావణ్రావు 17ఓట్ల మోజారిటీతో గెలుపొందారు. సహాయ కార్యదర్శిగా సంగెం రవీందర్, కోశాధికారిగా రాజ్కుమార్, ఈసీ మెంబర్లుగా రమేష్నాయక్, రాకేష్, ప్రశాంత్, రవీందర్, మహిళా సభ్యురాలిగా సుధారాణి ఎన్నికయ్యారు.
కోర్టు ఏర్పాటుకు కృషి చేశా..
జిల్లా కోర్టు, సివిల్ కోర్టుల ఏర్పాటుకు మొదటి నుంచి కృషి చేశాను. అధికారులు, ప్రజాప్రతినిధులను పలుమార్లు కలిసి కోర్టు ఏర్పాటు చేయాలని కోరాను. కోర్టు ఏర్పాటుకు ముందు పరకాల, హనుమకొండ, ములుగు, మంథని కోర్టులకు వెళ్లి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. నాటి సేవలను గుర్తించి న్యాయవాదులు అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. న్యాయవాదులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
– శ్రీనివాసచారి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు

బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా శ్రీనివాసచారి