
భూ సేకరణ త్వరగా పూర్తిచేయాలి
కాటారం: చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా ప్రధాన కాల్వల నిర్మాణం కోసం చేపడుతున్న భూ సేకరణ ప్రక్రియలో వేగంపెంచి త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ భూ సేకరణ విభాగం అధికారులకు సూచించారు. కాటారం మండలం గుమ్మాళ్లపల్లి, గూడూరు గ్రామాల్లో కొనసాగుతున్న భూ సేకరణ సర్వేను అదనపు కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. భూ నిర్వాసిత రైతులతో మాట్లాడారు. పలువురు నిర్వాసిత రైతులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. భూ సేకరణకు అధికారులకు రైతులు సహకరిస్తే కాల్వల నిర్మాణ పనులు త్వరగా పూర్తవుతాయని.. తద్వారా సాగు నీరందుతుందని తెలిపారు. రైతుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. భూ సేకరణ సర్వేలో అడ్డంకులు అధిగమించి సేకరణ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. భూ సేకరణలో పాటించాల్సిన నిబంధనలు, విధానం గురించి భూ సేకరణ అధికారులకు వివరించారు. ఆయన వెంట తహసీల్దార్ నాగరాజు, ఆర్ఐ వెంకన్న, భూ సేకరణ అధికారులు, ఇరిగేషన్ ఏఈఈలు, సిబ్బంది ఉన్నారు.
అదనపు కలెక్టర్ అశోక్కుమార్