లక్నవరంలో సందడి | - | Sakshi
Sakshi News home page

లక్నవరంలో సందడి

Jun 22 2026 1:00 AM | Updated on Jun 22 2026 1:00 AM

గోవిందరావుపేట: జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన లక్నవరం సరస్సు వద్ద ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. ముఖ్యంగా చిన్నారులతో వచ్చిన తల్లిదండ్రులు సరస్సు అందాలను ఆస్వాదిస్తూ ఆహ్లాదకరంగా గడిపారు. లక్నవరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే వేలాడే వంతెనపై నడుస్తూ సందర్శకులు ప్రకృతి సోయగాలను తిలకించారు. సెల్పీలు, ఫొటోలు దిగుతూ కుటుంబ సభ్యులు, యువత ఉత్సాహంగా గడిపారు. సరస్సు చుట్టూ విస్తరించిన పచ్చని వాతావరణం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. సరస్సులో బోటింగ్‌ నిర్వహించేందుకు అవసరమైన స్థాయిలో నీటిమట్టం లేకపోవడంతో అధికారులు బోటింగ్‌ను నిలిపివేశారు. దీంతో బోటింగ్‌ కోసం ప్రత్యేకంగా వచ్చిన పర్యాటకులు నిరాశతో వెనుదిరిగారు.

లక్నవరంలోని వేలాడే వంతెనపై పర్యాటకులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement