
గ్రామాల అభివృద్ధికి సర్కారు కృషి
● పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
పాలకుర్తి: గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. మండలంలోని వావిలాల, మల్లంపల్లి, దర్దెపల్లి, ఈరవెన్ను, శాతాపురం గ్రామాల్లో రూ.95 లక్షల సీఆర్ఆర్ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మాణ పనులకు బుధవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన అనంత రం ఆమె మాట్లాడారు. ప్రతి గ్రామంలో అంతర్గత రహదారులు ఏర్పాటు చేసి ప్రగతికి బాటలు వేస్తున్నామని చెప్పారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి సొంతింటి కల సాకారం చేస్తున్నామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ లావుడ్య మంజుల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల అధ్యక్షుడు గిరగా ని కుమారస్వామి, నాయకులు చిలువేరు కృష్ణమూర్తి, ఎర్రబెల్లి రాఘవరావు, యాకాంతరావు, పులి గణేష్, ఎండీ.మదార్, బిర్రు సోమేశ్వర్, జలగం కుమార్ తదితరులు పాల్గొన్నారు.