
నేనూ సర్కారు స్కూల్లోనే చదివా..
● అదనపు కలెక్టర్ పింకేశ్కుమార్
లింగాలఘణపురం: నేనూ సర్కారు స్కూల్లోనే చదివి నేడు ఐఏఎస్ స్థాయికి ఎదిగానని అదనపు కలెక్టర్ పింకేశ్కుమార్ అన్నారు. బుధవారం నేలపోగుల గ్రామంలోని రత్నమాల కేసరి(ఎంపీయూపీఎస్) పాఠశాలలో ప్రిప్రైమరీ తరగతులను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నేడు ప్రభుత్వ పాఠశాలల్లోనూ సకల సౌకర్యాలు ఉన్నాయని, విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఈఓ భోజన్న, ఎన్ఆర్ఐ లక్ష్మీనారాయణ, ఎంఈఓ విష్ణుమూర్తి, హెడ్మాస్టర్ నవీన్కుమార్ పాల్గొన్నారు. అనంతరం అనదనపు కలెక్టర్ కుందా రం ప్రాథమిక పాఠశాలను సందర్శించారు.
‘ఆదర్శ’ పాఠశాల పనులు పూర్తిచేయాలి
జనగామ రూరల్: అమ్మ ఆదర్శ పాఠశాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ అన్నారు. పట్టణంలోని కోర్టు వద్ద ఉన్న బాలికల జిల్లా పరిషత్ హైస్కూల్లో చేపట్టిన పనులను విద్య, రోడ్లు భవనాల శాఖ అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. అధికారులు పెండింగ్లో ఉన్న పనులు పరిశీలించి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. పాఠశాలలు, అంగన్వాడీల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఈఓ భోజన్న తదితరులు పాల్గొన్నారు.