
బస్పాస్లపై బాదుడు
గత ఏడాది జారీ చేసిన పాస్ల వివరాలు:
స్టూడెంట్ పాస్లు : 12,022
దివ్యాంగులు : 2,316
సీజనల్ : 784
డయాలసిస్ : 34
టోల్ పరిధిలో
స్టూడెంట్ పాస్ ధరల పెంపు
● జనరల్, స్టూడెంట్లపై అదనపు భారం
● ధరలు తగ్గించాలని డిమాండ్
జనగామ: స్టూడెంట్, సీజనల్(జనరల్) పాస్లతో పాటు సామాన్యులపై ఆర్టీసీ పెను భారం మోపింది. పెరిగిన టోల్ చార్జీల భారం విద్యార్థులపై పడుతుండగా.. జనరల్ పాస్లపై మోత మోగించారు. 2025 –26 నూతన విద్యా సంవత్సరం నుంచి ఇవి అమలులోకి వచ్చాయి. ధరల పెంపునకు సంబంధించి ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన రాలేదు. జనగామ డిపో పరిధిలో సుమారు 42రూట్లు ఉండగా, రోజు వారీగా 55వేల మంది ప్రయాణం చేస్తుంటారు.
సీజనల్, స్టూడెంట్లపై అదనపు భారం
రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న ప్రభుత్వం, జనరల్, స్టూడెంట్ పాస్ల చార్జీలు పెంచింది. 2024–25 సంవత్సరంలో జనగామ డిపో నుంచి దాదాపు 15,156 జనరల్, స్టూడెంట్, దివ్యాంగులు, డయాలసిస్ పేషెంట్లకు పాస్లు జారీ చేశారు. ఇందులో స్టూడెంట్స్ 12,022, దివ్యాంగులు 2,316, జనరల్ 784, డయాలసిస్ పేషెంట్లు 34 మంది ఉన్నారు. దివ్యాంగులకు 50 శాతం రాయితీ ఇస్తుండగా.. డయాలసిస్ చేయించుకునే వారికి ఉచి త ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రస్తుతం నూ తన విద్యాసంవత్సరంలో వాటిని రెన్యువల్ చేసుకో వాల్సి ఉంటుంది. టోల్ పరిధిలో స్టూడెంట్ పాస్ల ధరలు పెంచుతుండగా, జనరల్ మాత్రం సుమారు రూ.500 నుంచి రూ.600 వరకు పెరిగాయి.
స్టూడెంట్ పాస్ల ధరలు ఎలా అంటే..
స్టూడెంట్ మంత్లీ పాస్లకు సంబంధించి పెరిగిన ధరలు ఆన్లైన్లో అప్డేట్ కాలేదు. విద్యా సంస్థల్లో నూతన అడ్మిషన్ లేదా పాత విద్యార్థికి సంబంధించి పాఠశాల/కళాశాల నుంచి ఐడీ, ఎంఆర్ నంబర్తో ఆర్టీసీ బస్పాస్ కౌంటర్ వద్దకు స్టాంప్తో ఉన్న లెటర్ తీసుకెళ్లాలి. నెలవారీ పాస్ అప్లై చేసుకునే సమయంలో రూట్ వారీగా ఆన్లైన్లో కనిపించే పెరిగిన బస్పాస్ చార్జీల ఆధారంగా పాస్ జారీ అవుతుంది.
బస్పాస్ చార్జీలు తగ్గించాలి
స్టేషన్ఘన్పూర్ నుంచి రోజూ జిల్లా కేంద్రంలోని ఏకశిల ఐటీఐకి చదువుకునేందుకు వస్తాను. నెలవారీ బస్పాస్ ధర గత నెల రూ.375 ఉండేది. ప్రస్తుతం ధర పెంచడంలో అదనపు భారం తప్పదు. ప్రభుత్వ విద్యార్థులపై ఆర్థిక భారం మోపడం సరైంది కాదు. పెంచిన పాస్ల ధరలు తగ్గించాలి.
– భూక్యా ఆర్య, ఏకశిల ఐటీఐ,
స్టేషన్ఘన్పూర్
ధరలు పెరిగాయి.. క్లారిటీ రావాలి
జనరల్, స్టూడెంట్ బస్పాస్ల ధరలు పెరిగిన మాట వాస్తవం. జనరల్ పాస్లు ఇష్యూ చేస్తుండగా, స్టూడెంట్లకు మాత్రం కళాశాల లేదా పాఠశాల నుంచి తీసుకువచ్చిన ధ్రువీకరణ పత్రం ఆధారంగా జారీ చేస్తాం. విద్యార్థి బయోడేటాతో ఆన్లైన్లో చూసిన తర్వాతే ఆ రూట్లో మంత్లీ పాస్ ధర ఎంత అనే విషయం కనిపిస్తుంది.
– ఎస్.స్వాతి, డిపో మేనేజర్, జనగామ
జనగామ నుంచి నెలవారీగా పెరిగిన జనరల్ పాస్ల చార్జీలు
మండలం పాత చార్జీ పెరిగిన చార్జీ కిలోమీటర్లు
బచ్చన్నపేట రూ.850 రూ.1,250 20
నర్మెట రూ.850 రూ.1,250 20
స్టేషన్ఘన్పూర్ రూ.1,750 రూ.2,250 25
పాలకుర్తి రూ.1,250 రూ.1,650 35
సిద్దిపేట రూ.2,950 రూ.3,450 60
ఉప్పల్ రూ.4,150 రూ.4,650 80
కిలోమీటర్ల వారీగా పెరిగిన బస్పాస్ చార్జీలు
కి.మీ. స్టూడెంట్ పెరిగిన చార్జీ
పాత చార్జీ
4 రూ.150 రూ.225
8 రూ.200 రూ.300
12 రూ.300 రూ.450
18 రూ.390 రూ.585
22 రూ.450 రూ.675

బస్పాస్లపై బాదుడు

బస్పాస్లపై బాదుడు

బస్పాస్లపై బాదుడు

బస్పాస్లపై బాదుడు