ఢిల్లీ నుంచి వర్చువల్‌ విచారణ | - | Sakshi
Sakshi News home page

ఢిల్లీ నుంచి వర్చువల్‌ విచారణ

Jun 19 2025 4:14 AM | Updated on Jun 19 2025 4:14 AM

ఢిల్లీ నుంచి వర్చువల్‌ విచారణ

ఢిల్లీ నుంచి వర్చువల్‌ విచారణ

పాల్గొన్న మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌

జనగామ: ఢిల్లీ నుంచి బుధవారం వర్చువల్‌గా నిర్వహించిన విచారణలో జనగామ ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ గోపాల్‌రావు ఆధ్వర్యాన అధ్యాపక బృందం, ఆయా విభాగాల ప్రొఫెసర్లు పాల్గొన్నారు. మెడికల్‌ కళాశాల ఎనిమిది కేటగిరీల పరిధిలో కనీస వసతి సౌకర్యాలు లేవని జాతీయ వైద్య కమిషన్‌ షోకాజ్‌ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. 15వ తేదీన హైదరాబాద్‌లో జరిగిన సమీక్షకు ప్రిన్సిపాల్‌ హాజరు కాగా, ఢిల్లీ నుంచి చేపట్టే విచారణలో వర్చువల్‌గా పాల్గొనాలని ఆదేశించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి, వైద్య విద్య సంచాలకులు ప్రత్యక్షంగా హాజరు కాగా.. జనగామ నుంచి ప్రిన్సిపాల్‌, అధ్యాపక బృందం, ఆయా విభాగాల ప్రొఫెసర్లు పాల్గొని మెడికల్‌ కళాశాలలో ఉన్న వసతి సౌకర్యాలను వివరించారు. సీటీస్కాన్‌ సేవలు 10 రోజుల్లో అందుబాటులోకి రానున్నాయని, విద్యార్థుల బోధనకు ఆటంకం కలుగకుండా 10 మృత దేహాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఫాం–16, ఒక డాక్టర్‌ డిక్లరేషన్‌కు సంబంధించిన ప్రక్రియను సరిచేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఫేస్‌ రికగ్నైజేషన్‌ అంటెడెన్స్‌ కోసం ప్రభుత్వం నుంచి మిషన్లు సరఫరా చేయలేదని, ప్రస్తుతం సెల్‌ఫోన్‌ ఆధారంగా హాజరు నమోదు తీసుకుంటున్నట్లు వివరించారు. ఎమ్మారై యంత్రం ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని, పడకల విషయంలో క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ ప్రారంభమైతే మరో 100 అందుబాటులోకి వస్తాయనిన్నా రు. బిగ్‌, స్మాల్‌ ఆపరేషన్‌ థియేటర్ల సేవలు సైతం పెరుగుతాయని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement