పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలి | - | Sakshi
Sakshi News home page

పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలి

Jun 19 2025 4:14 AM | Updated on Jun 19 2025 4:14 AM

పిల్ల

పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలి

జనగామ రూరల్‌: తల్లిదండ్రులు తమ పిల్ల ల ను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలి.. పౌష్టికాహారంతో పాటు విద్యాబోధన ఉంటుందని సీడీపీఓ పూర్ణిమ అన్నారు. ఐసీడీఎస్‌ పిలుపుమేరకు బుధవారం పసరమడ్ల అంగన్‌వాడీ కేంద్రంలో చేపట్టిన ‘అమ్మ మాట అంగన్‌వాడీ బాట’ కార్యక్రమంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ.. సర్కారు స్కూళ్లలోనే విలువలతో కూడిన విద్య అందుతున్నదని, పిల్లల బంగారు భవిష్యత్‌కు బాటలు వేయాలంటే ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు.

ఎస్‌ఎస్‌సీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి

జనగామ రూరల్‌: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలు నివేదించిన వివిధ పోస్టులకు ప్రత్యక్ష నియామకం ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్షను ప్రాంతీయ సంచాలకులు కె.రగుల్‌ ఐ.ఏ.ఎస్‌.ఆధ్వర్యాన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోస్టుల వివరాలు, వయో ప రిమితి, అవసరమైన విద్యార్హత, చెల్లించాల్సిన రుసుము, పరీక్ష వివరాలు, దరఖాస్తు చేసే విధానం కోసం ఆన్‌లైన్‌లో సంప్రదించాలని సూచించారు. ఈనెల 24వ తేదీ లోగా దరఖా

స్తు చేసుకోవాలని కోరారు.

మహిళా సమాఖ్య

నూతన కార్యవర్గం ఎన్నిక

జనగామ రూరల్‌: చాకలి ఐలమ్మ మహిళా సమాఖ్య జిల్లా నూతన కార్యవర్గాన్ని బుధవా రం వివిధ మండల సమాఖ్యల అధ్యక్షులు ఎన్నుకున్నారు. ఎన్నికల అబ్జర్వర్‌గా పీఎం భారతి, డీపీఎం వరలక్ష్మి వ్యవహరించారు. నూతన అధ్యక్షురాలిగా దేవరుప్పుల మండల అధ్యక్షురాలు పి.మమత, కార్యదర్శిగా జనగా మ మండలానికి చెందిన కె.అరుణ, కోశాధికారిగా లింగాలఘణపురం మండలానికి చెంది న కె.రమ్యశ్రీ ఎన్నికయ్యారు. సమాఖ్య కార్యవర్గ సభ్యులు కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషాను మర్యాదపూర్వకంగా కలువగా ఆయన అభినందించా రు. మహిళల అభివృద్ధి, ఆర్థిక ఎదుగులకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ వసంత పాల్గొన్నారు.

అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

జనగామ రూరల్‌: జిల్లాలోని మైనారిటీ రెసిడెన్షియల్‌ జూనియర్‌ బాలుర కళాశాలలో ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన జూనియర్‌ ఫిజిక్స్‌ లెక్చరర్‌ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి విక్రమ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఫిజిక్స్‌ సబ్జెక్టులో 50 మార్కులతో పీజీ పూర్తి చేసి బి.ఎడ్‌ అర్హత కలిగి ఉండాలి, వయసు 44 ఏళ్ల లోపు, బోధనలో మూడేళ్ల అనుభవం ఉన్న వారు అర్హులని పేర్కొన్నారు. ఈనెల 26న సాయంత్రం 4 గంటలలోపు కలెక్టరేట్‌లోని జిల్లా మైనారిటీ సంక్షే మ శాఖ కార్యాలయంలో దరఖాస్తు అందజేయాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 9951933034, 9059679793, 93469 51278 నంబర్లలో సంప్రదించాలన్నారు.

పాలసీల పెంపులో నంబర్‌ వన్‌

చిల్పూరు: ఎల్‌ఐసీ పాలసీల పెంపులో 2024–25 సంవత్సరం తెలంగాణలోనే జిల్లా నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది.. ఇది సిబ్బంది, ఏజెంట్ల కృషి ఫలితమేనని జిల్లా సీనియర్‌ బ్రాంచి మేనేజర్‌ హరిలాల్‌ అన్నారు. మండల కేంద్రంలో జిల్లా స్థాయి మిలీయన్‌ డాలర్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో భాగంగా జిల్లాలోని 60 మంది ఏజెంట్లతో బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా చిల్పూరు ఆలయంలో ధర్మకర్త, ఎల్‌ఐసీ ఏజెంట్‌ తాళ్లపల్లి బుచ్చయ్య, పిట్టల మహేందర్‌, దారం రాజన్‌బాబు ఆధ్వర్యాన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్టేషన్‌ఘన్‌పూర్‌ బ్రాంచి మేనేజర్‌ మోతీలాల్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో హరిలాల్‌ మాట్లాడుతూ ఇండియాలో 2048 బ్రాంచీలు ఉండగా మొత్తం 33 బ్రాంచీ లు మొదటి స్థానంలో ఉన్నాయని, అందులో తెలంగాణలో జనగామ జిల్లా మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు.

పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలి1
1/1

పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement