
సర్వేయర్లు శిక్షణను వినియోగించుకోవాలి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా
జనగామ రూరల్: సర్వేయర్లు రాణించాలంటే శిక్షణను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కలెక్ట ర్ రిజ్వాన్ బాషా అన్నారు. బుధవారం జనగామ మండలం యశ్వంతాపూర్ క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ శిబిరాన్ని డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ మన్యంకొండతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సర్వేయర్ల కొరత ఉందని, ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకున్న వారు తప్పనిసరిగా రాణిస్తారని చెప్పారు. రెవెన్యూ శాఖలో ఎల్ఆర్ఎస్, మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్, జియోగ్రఫీ సర్వీసెస్, జీఎస్ మ్యాపింగ్ వాటిల్లో సర్వేయర్ల ఆవశ్యకత ఉన్నందున భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రైవేట్ పరంగా కూడా సర్వేయర్లకు మంచి అవకాశాలు వస్తాయని తెలిపారు. ఇదిలా ఉండగా.. థియరీ అనంతరం కళాశాల పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో సర్వేయర్లకు నిర్వహిస్తున్న ప్రాక్టికల్స్ పరిశీలించారు.