సర్కారు స్కూళ్లకు పెరుగుతున్న ఆదరణ | - | Sakshi
Sakshi News home page

సర్కారు స్కూళ్లకు పెరుగుతున్న ఆదరణ

Jun 19 2025 4:14 AM | Updated on Jun 19 2025 4:14 AM

సర్కారు స్కూళ్లకు పెరుగుతున్న ఆదరణ

సర్కారు స్కూళ్లకు పెరుగుతున్న ఆదరణ

దేవరుప్పుల : ప్రభుత్వం తలపెట్టిన ‘బడిబాట’.. మెరుగవుతున్న మౌలిక వసతులు.. అర్హత కలిగిన ఉపాధ్యాయులతో బోధనపై నమ్మకం.. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెరుగుతోంది. మండల పరిధి మాధాపురం ప్రభుత్వ పాఠశాలలో గత ఏడాది 27 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఏడాది గ్రామ విద్యావంతుల భాగస్వామ్యంతో ఆ సంఖ్య ఏకంగా 54 మందికి చేరారు. గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు సైతం తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్చడంతో గిరిజన ఆవాస ప్రాంత తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు ఉచిత విద్య అందించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు పాఠశాల హెచ్‌ఎం నల్ల లలిత తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సూర్జిత్‌, జీవన్‌, అంగన్‌వాడీ టీచర్లు విజయ, రజిత, పేరెంట్స్‌ సతీష్‌, నరేష్‌, మహేష్‌, సంపత్‌, లింగస్వామి, వినోద్‌, బిచ్చా, యాకు, మల్లేష్‌, రమేశ్‌, నవీన్‌, యాకన్న, శ్రీను, కుమారస్వామి, శంకర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement