
గాలిదుమారం.. అకాల వర్షం
అకాల వర్షాలు, ఈదురుగాలులు రైతులను వెంటాడుతూ దడ పుట్టిస్తున్నాయి. పొద్దంతా ఎండలు దంచి కొడుతూ.. సాయంకాలం ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు ఆగమాగం చేస్తున్నాయి. శనివారం జిల్లాలోని జనగామ, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల, రఘునాథపల్లితో పాటు తదితర మండలాల్లో కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసిపోయింది. విద్యుత్ స్తంభాలు కూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట తడిసిపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
● కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
● విద్యుత్ సరఫరాకు అంతరాయం
– మరిన్ని ఫొటోలు IIIలోu

గాలిదుమారం.. అకాల వర్షం