
ప్రజావాణి యథాతథం
జగిత్యాలటౌన్: కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని నేటి నుండి యథాతథంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన చేశారు. భూ భారతి అవగాహన సదస్సుల నిర్వహణ కారణంగా నిలిపివేసిన ప్రజావాణిని ఈనెల 16నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించవచ్చునని సూచించారు.
రైతువేదికలకు పరికరాలు
వెల్లుల్లలోని రైతు వేదిక
జగిత్యాలఅగ్రికల్చర్: రైతు వేదికలకు దృశ్య శ్రవణ పరికరాలు (వీడియో కాన్ఫరెన్స్కు సంబంధించిన) మంజూరయ్యాయి. జిల్లాలో 52 రైతువేదికలు ఉన్నాయి. ఇందులో 19 వేదికల్లో ఇప్పటికే పరికరాలు ఏర్పాటు చేశారు. తాజాగా 33 రైతువేదికలకు పరికరాలు వచ్చాయి. ఈ పరికరాలతో రైతులు నేరుగా వ్యవసాయ శాస్త్రవేత్తలతో మాట్లాడే అవకాశం ఉంటుంది. సాగుకు సంబంధించిన వివరాలను తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ పరికరాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభించనున్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ జిల్లాలోని ఏదో ఒక రైతు వేదికలో హాజరుకానున్నారు. కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ తెలిపారు.
నృసింహుడి సన్నిధిలో భక్తుల రద్దీ
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గోదావరిలో స్నానాలు ఆచరించి.. ప్రధాన ఆలయంతోపాటు అనుబంధ ఆలయాల్లో స్వామివార్లను దర్శించుకున్నారు.

ప్రజావాణి యథాతథం

ప్రజావాణి యథాతథం