
ఉగ్రముఠాకు తగిన గుణపాఠం చెప్పాలి
జగిత్యాల: పహల్గమ్లోని జైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణరహితంగా కాల్పులు జరిపి ప్రాణాలు తీసిన ఘటనను మాజీమంత్రి జీవన్రెడ్డి ఖండించారు. పాకిస్తాన్ ఉగ్రవాద ముఠాకు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసముందన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించే ప్రజలకు భద్రత కల్పించాలని, కేంద్రప్రభుత్వం భరోసా ఇవ్వాలని సూచించారు. పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తోయిబా అనుబంధ సంస్థ పర్యాటకులపై దాడికి పాల్పడినట్లు ప్రకటించుకున్న ఉగ్రముఠాను ఉపేక్షించవద్దన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే సర్జికల్ స్ట్రైక్ చేపట్టాలన్నారు. దేశంలో అల్లర్లు సృష్టించేందుకు కుట్రచేస్తున్న పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కాల్పుల్లో మృతిచెందిన బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం అందించాలని, ఒక్కొక్కరికి ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ముందుగా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.
రజతోత్సవ సభకు తరలిరండి
● జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత
జగిత్యాలరూరల్: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా తరలిరావాలని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం, చల్గల్ గ్రామాల్లో బుధవారం ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. అంతర్గాంలో తాగునీరు, సాగునీరు అంది పంటపొలాలు పచ్చగా ఉన్నాయంటే అది కేసీఆర్, కవిత ఘనతేనన్నారు. ఇల్లులేని నిరుపేదలకు 100 డబుల్బెడ్రూం ఇళ్లు ఇచ్చిన ఘనత కవితదేనని గుర్తు చేశారు. ఈనెల 27న వరంగల్లో జరిగే రజతోత్సవ సభకు కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు. మాజీమంత్రి రాజేశంగౌడ్, సింగిల్ విండో చైర్మన్ మహిపాల్రెడ్డి, నాయకులు ఆనందరావు, గంగాధర్, తిరుపతి, శ్రీనివాస్గౌడ్, షఫీ, మల్లేశ్, రాజయ్య, మహేశ్, పోచమల్లయ్య, రంజిత్ పాల్గొన్నారు.
మున్సిపల్ కార్మికులకు పీపీఈ కిట్లు
ధర్మపురి: ధర్మపురి మున్సిపల్ కార్యాలయ కార్మికులకు బుధవారం శానిటేషన్ పరికరాలు, పీపీఈ కిట్లయిన తట్టలు, పారలు, చీపుర్లు, గ్లౌజులను కమిషనర్ రాజశేఖర్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో మేనేజర్ గంగాధర్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ గంగాధర్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ మహేశ్, సిబ్బంది తదితరులున్నారు.

ఉగ్రముఠాకు తగిన గుణపాఠం చెప్పాలి

ఉగ్రముఠాకు తగిన గుణపాఠం చెప్పాలి