
వరంగల్ సభకు చలో చలో..
మేడిపల్లి: ఈనెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మండలంలోని అన్ని గ్రామాల నుంచి అధిక సంఖ్యలో తరలిరావాలని పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు కోరారు. సోమవారం మండలకేంద్రంలో ముఖ్య నాయకులతో సమావేశమై సభ వాల్పోస్టర్ ఆవిష్కరించారు. పార్టీ 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా గ్రామగ్రామాన బీఆర్ఎస్ జండా ఎగురవేయాలని, వరంగల్ సభకు తరలిరావాలని కోరారు. పార్టీ మండల అధ్యక్షుడు క్యాతం సత్తిరెడ్డి, చెన్నమనేని అజిత్రావు, ఉదిగిరి ఆదిరెడ్డి, మకిలీ దాసు, దేశవేని కృష్ణ, నాంచారి రాజేందర్ పాల్గొన్నారు.