భూసమస్యల పరిష్కారానికే ‘భూ భారతి’ | - | Sakshi
Sakshi News home page

భూసమస్యల పరిష్కారానికే ‘భూ భారతి’

Apr 22 2025 12:19 AM | Updated on Apr 22 2025 12:19 AM

భూసమస

భూసమస్యల పరిష్కారానికే ‘భూ భారతి’

మెట్‌పల్లిరూరల్‌: రైతుల భూ సమస్యలన్నింటికీ భూభారతి ద్వారా పరిష్కారం లభిస్తుందని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. మెట్‌పల్లి శివారులోని ఓ గార్డెన్‌లో భూభారతి చట్టంపై సోమవారం అవగాహన కల్పించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న సాదాబైనామా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. వీఆర్‌వో, వీఆర్‌ఏలు లేకపోవడంతో రైతుల భూ సమస్యలను గుర్తించేందుకు తహసీల్దార్లకు ఇబ్బందులు ఎదురయ్యాయని, నూతన చట్టంతో గ్రామస్థాయిలోనే సమస్యలు పరిష్కారం అవుతాయని వెల్లడించారు. ఏటా డిసెంబర్‌ 31న భూభారతి చట్టంలోని రికార్డులను ఆప్‌డేట్‌ చేస్తారన్నారు. అనంతరం విట్టంపేట, మెట్లాచిట్టాపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఆర్డీవో శ్రీనివాస్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, మున్సిపల్‌ కమిషనర్‌ మోహన్‌, డీఆర్డీవో పీడీ రఘువరన్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గోవర్ధన్‌, ఆర్‌ఐలు కాంతయ్య, ఉమేశ్‌, నాయకులు, రైతులు పాల్గొన్నారు.

భూములకు రక్షణ కల్పించేందుకే కొత్త చట్టం: విప్‌ అడ్లూరి

గొల్లపల్లి: భూములకు రక్షణ కల్పించడానికే ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భూభారతి పోర్టల్‌ను రైతుల శ్రేయస్సే లక్ష్యంగా రూపొందించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ సత్యప్రసాద్‌

భూసమస్యల పరిష్కారానికే ‘భూ భారతి’1
1/1

భూసమస్యల పరిష్కారానికే ‘భూ భారతి’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement