
వరంగల్ సభతో బీఆర్ఎస్ సత్తా చాటుదాం
కథలాపూర్: ఈనెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభతో పార్టీ సత్తాను చాటుదామని ఆ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. మండలకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తి కావడం సంతోషంగా ఉందన్నారు. బీఆర్ఎస్ సభకు ప్రతీ గ్రామం నుంచి కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో తరలిరావాలన్నారు. ప్రతీ గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులు సభ కోసం సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మామిడిపల్లి రవి, కిరణ్రావు, గడ్డం భూమారెడ్డి, కేసరి సాయన్న, దొప్పల జలందర్, వంగ రవీందర్, శీలం మోహన్రెడ్డి, ఏజీబీ మహేందర్, తిరుజానీ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
● బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ