గ్రావిటి కాలువలో దూకి వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

గ్రావిటి కాలువలో దూకి వ్యక్తి ఆత్మహత్య

Apr 20 2025 2:07 AM | Updated on Apr 20 2025 2:07 AM

గ్రావ

గ్రావిటి కాలువలో దూకి వ్యక్తి ఆత్మహత్య

రామడుగు(చొప్పదండి): రామడుగు మండలం గోపాల్‌రావుపేట గ్రామానికి చెందిన పురాణం సాగర్‌ (30) రామడుగు సమీపాన గల గాయత్రి పంపుహౌజ్‌ నుంచి వెళ్లే గ్రావిటి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై రాజు తెలిపిన వివరాలు.. సాగర్‌కు పురాణం పద్మతో 9 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. కాగా సాగర్‌ కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో శుక్రవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన సాగర్‌ రామడుగు సమీపాన ఉన్న గ్రావిటి కాలువలో బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

దేశాయిపల్లిలో వృద్ధుడు..

బోయినపల్లి(చొప్పదండి): నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతు న్న మండలంలోని దేశాయిపల్లికి చెందిన వృద్ధుడు సంది దుర్గారెడ్డి(80) క్రిమిసంహారక మందు తాగగా.. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. ఎస్సై పృథ్వీధర్‌ తెలిపిన వివరాలు. దుర్గారెడ్డి కొంతకాలంగా నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఎన్ని మందులు వా డినా తగ్గలేదు. దీంతో జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఇంట్లో పురుగుల మందు సేవించాడు. కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని భార్య సంది లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

కుటుంబ కలహాలతో ఒకరు..

కోరుట్లరూరల్‌: కోరుట్ల పట్టణంలోని సాయిరాంపుర కాలనీకి చెందిన ఎలిగేటి శ్రీహరి (36) శనివారం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడిపల్లి మండలం మన్నెగూడెం గ్రామానికి చెందిన శ్రీహరి ఉపాధి నిమిత్తం కొన్నేళ్లు గల్ఫ్‌ వెళ్లి వచ్చాడు. సాయిరాంపురలో ఇట్లు కట్టుకుని భార్య లాస్య, కుమారుడు హర్ష, కూతురు నేహతో కలిసి ఉంటున్నాడు. కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. శనివారం కూడా ఇద్దరూ గొడవ పడ్డారు. పిల్లలు స్కూల్‌కు వెళ్లగా.. భార్య ఇంటి బయట పనులు చేసుకుంటోంది. ఇంతలో శ్రీహరి బెడ్‌రూంలోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. భార్య వచ్చి చూసి పక్కింటివారిని పిలిచి చూడగా అప్పటికే మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. లాస్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

గ్రావిటి కాలువలో దూకి వ్యక్తి ఆత్మహత్య
1
1/2

గ్రావిటి కాలువలో దూకి వ్యక్తి ఆత్మహత్య

గ్రావిటి కాలువలో దూకి వ్యక్తి ఆత్మహత్య
2
2/2

గ్రావిటి కాలువలో దూకి వ్యక్తి ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement