గ్రామగ్రామాన దండు కట్టాలి | - | Sakshi
Sakshi News home page

గ్రామగ్రామాన దండు కట్టాలి

Apr 20 2025 2:06 AM | Updated on Apr 20 2025 2:06 AM

గ్రామగ్రామాన దండు కట్టాలి

గ్రామగ్రామాన దండు కట్టాలి

సారంగాపూర్‌: బీఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవ సభకు ప్రతి గ్రామం నుంచి దండుకట్టి బయల్దేరాలని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత అన్నారు. శనివారం మండలంలోని పలు గ్రామాల్లో సభకు జనం తరలింపుపై పర్యటించి సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 27న జరిగే రజతోత్సవ సభకు తరలిరావాలని కోరారు. ఈ సందర్భంగా మండలంలోని లక్ష్మీదేవిపల్లికి చెందిన దివ్యాంగుడు రమేశ్‌ పింఛన్‌ సొమ్ము రూ.రెండు వేలు అందించి కేసీఆర్‌ సభకు ఖర్చు చేయాలని కోరారు. కార్యక్రమంలో సారంగాపూర్‌, బీర్‌పూర్‌ మండలాల పార్టీ అధ్యక్షులు తేలు రాజు, మాజీ సర్పంచ్‌లు భూక్య సంతోష్‌, బల్మూరి నారాయణరావు, వెంకటేష్‌, బుచ్చిమల్లయ్య, పార్టీ సీనియర్‌ నాయకులు సాంబరి గంగాధర్‌, ఎండబెట్ల ప్రసాద్‌, జలేందర్‌, వొడ్నాల జగన్‌, సాతల్ల రమేశ్‌ తదితరులు ఉన్నారు.

రజతోత్సవ సభకు తరలిరావాలి

జెడ్పీ మాజీ చైర్‌ పర్సన్‌ దావ వసంత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement