నేపాల్-చైనా సరిహద్దులో మెరుపు వరదలు సృష్టించిన బీభత్సం.. అంతా ఇంతా కాదు. నేపాల్ను జల ప్రళయం కకావికలం చేస్తున్న వేళ.. ఆధునిక నిర్మాణ రంగం ఇలాంటి ప్రకృతి విపత్తులను ఎంతవరకు తట్టుకోగలదనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ భీకర జల ప్రళయం నేర్పిన పాఠాలు ఏంటి? వీటన్నిటిని తట్టుకునేలా పర్వత ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతాల్లో భవిష్యత్ నగరాల భవన డిజైన్లు అసలు ఎలా ఉండాలనే దానిపై చర్చ నడుస్తోంది.
ప్రకృతి వైపరీత్యాలను ముందే ఊహించి అధునాతన మోడలింగ్ సాంకేతిక ద్వారా ప్రాణ ఆస్తి నష్టాలను ఎలా నివారించవచ్చో ప్రముఖ ఆర్కిటెక్చర్ నిపుణులు డాక్టర్ ప్రదీప్కుమార్ విశ్లేషించారు. నేపాల్లో జల విలయానికి అసలు కారణాలు ఏంటి?. ఏం జరిగింది? భవిష్యత్లో ఏం జరగబోతుంది? పలు షాకింగ్ విషయాలను సాక్షి ఇంటర్వ్యూలో పంచుకున్నారు. పూర్తి వివరాలు కోసం కింది వీడియోను చూడండి.


