ఏటా ఒకచోట వేడుకలు | - | Sakshi
Sakshi News home page

ఏటా ఒకచోట వేడుకలు

Aug 28 2026 4:33 AM | Updated on Aug 28 2026 4:33 AM

ఏటా ఒకచోట వేడుకలు

డోర్నకల్‌: డోర్నకల్‌లోని బ్యాంక్‌ స్ట్రీట్‌కు చెందిన కాలా యశోధర్‌ జైన్‌కు తొమ్మిది మంది అక్కాచెల్లెళ్లు. వీరంతా తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో నివాసం ఉంటున్నారు. ఏటా రాఖీ పండుగను పురస్కరించుకుని అక్కాచెళ్లెళ్లలో ఒకరి ఇంటికి తమ సోదరుడిని పిలిపించుకుంటారు. అందరూ అతడికి రాఖీలు కట్టి ఆనందంగా గడుపుతారు. ఇటీవల మహారాష్ట్రలోని అమరావతి జిల్లా పరత్వాడాలోని సోదరి ఇంటికి అందరూ చేరుకుని సోదరుడు యశోధర్‌జైన్‌కు రాఖీలు కట్టి దీవెనలు అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement