
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
ఖిలా వరంగల్: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బీవీ నిర్మలా గీతాంబ సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం మామునూరు జవహర్ నవోదయ విద్యాలయంలో జరిగిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. యువత మత్తు పదార్థాలకు అలవాటుపడితే అనేక సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. దేశ భవిష్యత్ను కుంగదీసే మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు కృషిచేయాలని పేర్కొన్నారు. మత్తు పదార్థాల వినియోగం సరదగా మొదలై వ్యసనంలా మారి చివరకు జీవితాన్ని నాశనం చేస్తాయని వివరించారు. మద్యం, డ్రగ్స్ మత్తులో తీవ్రమైన నేరాలకు పాల్ప డుతారని, మత్తు పదార్థాలు సేవించడం హానికరమని, చట్టరీత్యా నేరమని జడ్జి పేర్కొన్నారు. సదస్సులో మామునూరు ఏసీపీ వెంకటేశ్, ఇన్స్పెక్టర్ ర మేశ్, లీగల్ కౌన్సిల్ పి.శ్రీనివాస్రావు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వలుస సుధీర్, ప్రిన్సిపాల్ బి.పూర్ణిమ, కృష్ణవేణి, సిల్వర్ క్రౌన్ హైస్కూల్ నుంచి 600 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బీవీ నిర్మలాగీతాంబ