అసిస్టెంట్‌ లైన్‌మెన్‌కు విద్యుత్‌ షాక్‌ | - | Sakshi
Sakshi News home page

అసిస్టెంట్‌ లైన్‌మెన్‌కు విద్యుత్‌ షాక్‌

Jun 27 2025 4:03 AM | Updated on Jun 27 2025 4:03 AM

అసిస్టెంట్‌ లైన్‌మెన్‌కు విద్యుత్‌ షాక్‌

అసిస్టెంట్‌ లైన్‌మెన్‌కు విద్యుత్‌ షాక్‌

● రాంగ్‌ ఎల్‌సీతో ప్రమాదం..

హసన్‌పర్తి: ఇటీవల పర్వతగిరి లో విద్యుత్‌ శాఖలో కాంట్రాక్ట్‌ పద్ధతిపై విధులు నిర్వర్తిస్తున్న బాలాజీ ప్రమాదానికి గురైన ఘటన మరుక ముందే హసన్‌పర్తి మండలం జయగిరి సబ్‌స్టేషన్‌ పరిధిలోని అన్నాసాగరంలో మరో ఘటన గురువారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అసిస్టెంట్‌ లైన్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్న చంద్రమూర్తి ప్రమాదానికి గురయ్యాడు. విద్యుత్‌ స్తంభం ఎక్కి ఏబి స్విచ్‌ మరమ్మతు చేస్తున్న క్రమంలో విద్యుత్‌ ప్రమాదానికి గురై పోల్‌పైనే వేలాడాడు. ఈ ఘటనలో చంద్రమూర్తికి తీవ్ర గాయాలయ్యా యి. క్షతగాత్రుడిని ఎంజీఎం తరలించారు. పరిస్థితి వి షమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తరలించినట్లు స్థానికులు తెలిపారు.

రాంగ్‌ ఎల్‌సీతో ప్రమాదం..

అన్నాసాగరం పరిధిలోని ఎస్‌ఎస్‌ 36 100 కేవీఏ వద్ద సాంకేతిక సమస్య ఉత్పన్నమైంది.దీంతో అసిస్టెంట్‌ లైన్‌మెన్‌ చంద్రమూర్తి ఎల్‌సీ తీసుకున్నాడు. స్తంభం ఎక్కి మరమ్మతు చేయడానికి యత్నిస్తున్న క్రమంలో విద్యుత్‌ ప్రమాదానికి గురయ్యాడు. రాంగ్‌ ఎల్‌సీ ఇవ్వడంతో ఈ ప్రమాదం జరిగినట్లు విద్యుత్‌ఽశాఖ అధికారులు చెబుతున్నారు.

సబ్‌స్టేషన్‌కు వెళ్లకుండానే ఎల్‌సీ..

ఇదిలా ఉండగా, ఎక్కడైనా విద్యుత్‌ సమస్య ఏర్పడినప్పుడు సంబంధిత సబ్‌స్టేషన్‌కు వెళ్లి ఎల్‌సీ తీసుకోవాలి. కొంతమంది లైన్‌మెన్లు మాత్రం ఫోన్‌ ద్వా రా అక్కడ ఉన్న ఆపరేటర్‌కు సమాచారమిచ్చి ఎల్‌సీ తీసుకున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కాగా, విద్యుత్‌ ప్రమాదంపై విచారణ చేపడుతున్నట్లు ఏఈ అశోక్‌కుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement