
గడ్డం కేశవమూర్తికి ఎన్టీఆర్ అవార్డు
హన్మకొండ అర్బన్ : సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రచయిత గడ్డం కేశవమూర్తికి విజయవాడకు చెందిన ఎక్స్ రే సాహిత్య సాంస్కతిక సేవా సంస్థ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని పద్మశ్రీ ఎన్టీ రామారావు స్మారక అవార్డు ప్రకటించింది. ప్రముఖ సినీ నటు డు డాక్టర్ రాజేంద్రప్రసాద్తోపాటు గడ్డం కేశవమూర్తికి ఈ అవార్డును ప్రదానం చేసింది. ఈ మేర కు గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణా భివృద్ధి శాఖల మంత్రి ధనసరి సీతక్క చేతుల మీదుగా కేశవమూర్తి ఈ అవార్డును అందుకున్నారు. కేశవమూర్తికి అవార్డు లభించడం పట్ల వివిధ జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
కన్సల్టెన్సీల కార్మిక దోపిడీ
అరికట్టాలి
హన్మకొండ: ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల కన్సల్టెన్సీల కార్మిక దోపిడీని అరికట్టాలని టీజీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న డిమాండ్ చేశారు. జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులకు డ్రైవర్లను సరఫరా చేస్తున్న శ్రీ బాలాజీ కన్సల్టెన్సీ , సిస్కాన్ సంస్థలు డ్రైవర్ల జీతాల నుంచి పీఎఫ్ డబ్బులు కోత విధించి 5 నెలలుగా ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో జమ చేయకుండా సొంతానికి వాడుకోవడం అన్యాయమని గురువారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 5 నెలల నుంచి జేబీఎం బస్సులపై పని చేస్తున్న కార్మికుల జీతాల నుంచి పీఎఫ్ పేరుతో నెలకు రూ.3 వేల చొప్పున వసూలు చేసి ఖాతాలో జమ చేయకపోవడాన్ని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. పీఎఫ్ సొమ్ము దుర్వినియోగంపై జేబీఎం, ఆర్టీసీ యాజమాన్యం వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకుని ఆ సొమ్మును పీఎఫ్ ఖాతా లో జమ చేయించాలని డిమాండ్ చేశారు.
కేయూ పీజీ కోర్సుల
రెండో సెమిస్టర్ పరీక్షలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో పీజీ కోర్సుల రెండో సెమిస్టర్ పరీక్షలు జూలై 25నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి సౌజన్య గురువారం తెలిపారు. ఈ మేరకు గురువారం టైం టేబుల్ విడుదల చేశారు. పీజీ కోర్సుల ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ జర్నలిజం మాస్ కమ్యూనికేషన్, ఎంఎల్ఐఎస్సీ, ఎంటీఎం, ఎంఎస్డబ్ల్యూ, ఎంహెచ్ఆర్ఎం కోర్సుల రెండో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నారు. జూలై 25, 28, 30, అగస్టు 1, 4, 6వ తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు సౌజన్య తెలిపారు.

గడ్డం కేశవమూర్తికి ఎన్టీఆర్ అవార్డు

గడ్డం కేశవమూర్తికి ఎన్టీఆర్ అవార్డు