
అలరించిన ‘రుక్మిణీ కల్యాణం’
హన్మకొండ అర్బన్: శ్రీ వేణుగోపాలస్వామి కళానాట్యమండలి దశమ వార్షికోత్సవం సందర్భంగా గురువారం హనుమకొండ కాళోజి కళాక్షేత్రంలో ప్రదర్శించిన రుక్మిణీ కల్యాణం పౌరాణిక పద్య నాటకం ఆహుతులను అలరించింది. స్టేషన్ఘన్పూర్ నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షుడు అక్కెనపల్లి రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షుడు ఆకుల సదానందం జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. కాళోజీ కళాక్షేత్రంలో మొట్టమొదటి పౌరాణిక పద్య నాటకం ప్రదర్శించే అవకాశం దక్కడం ఎంతో అదృష్టమన్నారు. నాటకం రూపొందించిన రవీందర్, కళాకారులను అభినందించారు.