అలరించిన ‘రుక్మిణీ కల్యాణం’ | - | Sakshi
Sakshi News home page

అలరించిన ‘రుక్మిణీ కల్యాణం’

Jun 27 2025 4:03 AM | Updated on Jun 27 2025 4:03 AM

అలరించిన ‘రుక్మిణీ కల్యాణం’

అలరించిన ‘రుక్మిణీ కల్యాణం’

హన్మకొండ అర్బన్‌: శ్రీ వేణుగోపాలస్వామి కళానాట్యమండలి దశమ వార్షికోత్సవం సందర్భంగా గురువారం హనుమకొండ కాళోజి కళాక్షేత్రంలో ప్రదర్శించిన రుక్మిణీ కల్యాణం పౌరాణిక పద్య నాటకం ఆహుతులను అలరించింది. స్టేషన్‌ఘన్‌పూర్‌ నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షుడు అక్కెనపల్లి రవీందర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షుడు ఆకుల సదానందం జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. కాళోజీ కళాక్షేత్రంలో మొట్టమొదటి పౌరాణిక పద్య నాటకం ప్రదర్శించే అవకాశం దక్కడం ఎంతో అదృష్టమన్నారు. నాటకం రూపొందించిన రవీందర్‌, కళాకారులను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement