
రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి
కాజీపేట రూరల్: కాజీపేటలో రైల్వే సంబంధిత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఏడీఆర్ఎం గోపాలకృష్ణన్ అన్నారు. సికింద్రాబాద్లో మజ్దూర్ యూనియన్తో బుధవారం జరిగిన 164వ రివ్యూ రైల్వే ఏడీఆర్ఎం పీఎన్ఎం సమావేశంలో పాల్గొంనేందుకు కాజీపేట నుంచి యూనియన్ నాయకులు బుధవారం తరలివెళ్లారు. రైల్వే సంబంధిత, కార్మి కులు, ఉద్యోగులు, అధికారుల సమస్యలు ప్రస్తావించగా, పరిష్కారానికి ఏడీఆర్ఎం హామీ ఇచ్చిన ట్లు యూనియన్ సికింద్రాబాద్ డివిజన్ సెక్రటరీ పి.రవీందర్ తెలిపారు. కాజీపేట రైల్వే ఎలక్ట్రిక్ లోకో షెడ్ వద్ద కార్మికుల కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, కాజీపేట రైల్వే రెఫరల్ ఆస్పత్రిగా శరత్ ఐ ఆస్పత్రి, ఎలక్ట్రిక్ లోకో షెడ్లో అడిషనల్ ఉమెన్ రూమ్స్, కాజీపేట రైల్వే ఎలక్ట్రిక్ లోకో షెడ్లో క్యాంటీన్ విస్తరణ, హసన్పర్తి – బిజిగిరి షరీఫ్ మధ్య అడిషనల్ పాయింట్స్ మెన్ల ఏర్పాటుకు గోపాలకృష్ణన్ అంగీకరించినట్లు పేర్కొన్నారు.