వీసీని కలిసిన కేయూ ఎన్జీఓ నూతన కార్యవర్గం | - | Sakshi
Sakshi News home page

వీసీని కలిసిన కేయూ ఎన్జీఓ నూతన కార్యవర్గం

Jun 24 2025 3:17 AM | Updated on Jun 24 2025 3:17 AM

వీసీని కలిసిన కేయూ  ఎన్జీఓ నూతన కార్యవర్గం

వీసీని కలిసిన కేయూ ఎన్జీఓ నూతన కార్యవర్గం

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ ఎన్‌జీఓ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌కు ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో విజయం సాధించిన ఆ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం అధ్యక్షుడు బి.నవీన్‌కుమార్‌, జనరల్‌ సెక్రటరీ వల్లాల తిరుపతి, ఇతర బాధ్యులు సోమవారం మర్యాదపూర్వకంగా వీసీ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డిని కలిశారు. ఈసందర్భంగా ఎన్‌జీఓ కేడర్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వీసీ దృష్టికి తీసుకెళ్లారు. వీసీని కలిసిన వారిలో ఎన్‌జీఓ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మహ్మద్‌ యూనస్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఎ.సతీశ్‌బాబు, రిక్రియేషన్‌ సెక్రటరీ తోట ప్రభాకర్‌, కోశాధికారి తాటి దామోదర్‌, మహిళా సెక్రటరీ బి.కృష్ణవేణి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement