
ట్రాక్టర్ బోల్తా.. అన్నదాత దుర్మరణం
● లక్ష్మారెడ్డిపల్లెలో ఘటన
గణపురం : సొంత వ్యవసాయ భూమిలో కల్టివేటర్తో దున్నుతుండగా ట్రాక్టర్ బోల్తాపడి రైతు ఓద్దుల రాంరెడ్డి (46) అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషాద ఘటన సోమవారం గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లెలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు రాంరెడ్డి తన భూమిలో సొంత ట్రాక్టర్తో దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు రాంరెడ్డిని బయటకు తీసే ప్రయత్నం చేసిన సాధ్యపడలేదు. వెంటనే క్రేన్ సహాయంతో ట్రాక్టర్ను పక్కకు జరిపి రాంరెడ్డి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడికి భార్య జ్యోతి, కుమారుడు, కూతురు ఉన్నారు. జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు. అందరితో కలిసిమెలిసి ఉండే రాంరెడ్డి మృతితో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.
బైక్ అదుపుతప్పి ఆర్ఎంపీ మృతి
ఎల్కతుర్తి : బంధువుల వేడుకకు వెళ్లి వస్తుండగా బైక్ అదుపుతప్పి ఓ ఆర్ఎంపీ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సోమవారం భీమదేవపల్లి మండలం గట్లనర్సింగాపూర్ శివారులో జరిగింది. ఎస్సై సాయిబాబు కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం జగన్నాథపూర్ గ్రామానికి చెందిన ఆర్ఎంపీ చిర్ర సుదర్శన్ (60) ఆదివారం హుస్నాబాద్లో జరిగిన బంధువుల ఫంక్షన్కు ద్విచక్ర వాహనంపై వెళ్లి అర్ధరాత్రి 1గంటకు తిరిగి వస్తున్నాడు. ఈక్రమంలో బైక్ అదుపుతప్పి కిందపడి పోయాడు. దీంతో అతడి తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుమారుడు విజయ్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.
రైలు నుంచిపడి వ్యక్తి..
ఖిలా వరంగల్ : ప్రమాదవశాత్తు రైలు నుంచి జారీ పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం సాయంత్రం నెక్కొండ–ఎలుగూరు రైల్వే స్టేషన్ మధ్య గేటుపల్లి తండా సమీపంలో చోటుచేసుకుంది. జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ ఎస్.రవీందర్రెడ్డి కథనం ప్రకారం.. నెక్కొండ– ఎలుగూరు రైల్వే గేటు మధ్య గేటుపల్లి తండా సమీపంలో రైలు నుంచి ప్రమాదవశాత్తు 55 ఏళ్ల వయసు గల వ్యక్తి సోమవారం పడి దుర్మరణం చెందాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుడు బూడిద కలర్ కాటన్ ప్యాంట్, గులాబీ కలర్ ఫుల్ షర్ట్, తెల్ల బనియన్, బ్రౌన్ కలర్ డ్రాయర్ ధరించి ఉన్నాడని, తెల్లని వెంట్రుకలు, గడ్డం మీసాలు కలిగి ఉన్నాడు. మృతుడు 5.6 ఎత్తు, ఎరుపు రంగు గుండ్రని ముఖం, గుర్తు పట్టుటకు పొట్ట, ఛాతిపై పుట్టుమచ్చలు కలవు. రైల్వే అధికారుల ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించి భద్రపరిచారు. ఎవరైనా గుర్తిస్తే 98497 49220 సమాచారం అందజేయాలని జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ రవీందర్ రెడ్డి తెలిపారు.

ట్రాక్టర్ బోల్తా.. అన్నదాత దుర్మరణం