
ఆర్టీసీ మహాసభను జయప్రదం చేయాలి
హన్మకొండ: ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం మహాసభను జయప్రదం చేయాలని ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం వరంగల్ రీజియన్ అధ్యక్షుడు గొలనుకొండ వేణు, కార్యదర్శి మాదారపు సాంబయ్య పిలుపునిచ్చారు. ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర మహాసభ వాల్పోస్టర్లను హనుమకొండలోని వరంగల్ –1, వరంగల్ –2 డిపోల వద్ద సంఘం నాయకులు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈనెల 24న బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర మహాసభ జరుగనుందని చెప్పారు. వరంగల్ రీజియన్లోని ఆర్టీసీ బీసీ ఉద్యోగులందరూ తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రీజియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బండారి శ్రీనివాస్, వరంగల్ –1 డిపో అధ్యక్షుడు దుంపేటి యాదగిరి, సెక్రటరీ పోతరాజు రమేష్, వరంగల్ –2 డిపో అధ్యక్షుడు కిరణ్, కార్యదర్శి శ్రీధర్ ఆర్టీసీ బీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.